ఏవో వీసాలు సులువుగా వచ్చేస్తాయి అనే ఆశతో …
కొందరు ఇండియన్ అమెరికన్స్, అన్ని చవగ్గా వచ్చేస్తాయి అనే కక్కుర్తితో కొందరు నేటివ్ అమెరికన్స్ …
ఉన్నంతలో బాగా పాలిస్తున్న,
తన 4 సం. ల.పాలనలో ప్రపంచంలో శాంతి నెలకొల్పడానికి ప్రయత్నించిన ట్రంప్ ని కాదు అని బీడెన్ ని ఎన్నికల్లో గెలిపించి ప్రపంచ నెత్తిన పెట్టారు.
ట్రంప్ వివిధ దేశాల మధ్య ముఖ్యంగా ఎప్పుడూ యుద్దాలు జరిగే మిడిల్ ఈస్ట్ లో దేశాల మధ్య శాంతి ఒప్పందాలు కూడా కుదిర్చాడు. ఇది అమెరికన్ ఆయుధ లాబీకి నచ్చలేదు. అందుకే అంతా కట్ట కట్టుకుని తమ చేతిలో ఉన్న మీడియా, ముఖ్యంగా సోషల్ మీడియా దిగ్గజాలు ట్విట్టర్ ఫేస్ బుక్ ట్రంప్ పై విపరీతంగా వ్యతిరేక ప్రచారం చేశారు. ఆ ప్రచారానికి వెనక ఉన్నది ఈ ఆయుధ లాబీ నే. అందుకే ట్రంప్ సమయంలో కరోనా మీద నెగటివ్ పబ్లిసిటీ తో ట్రంప్ మీద దాడి చేశారు.
చదువుకున్న అమెరికన్ ప్రజలు ఆ మాటలకు మోసపోయి ట్రంప్ కి వ్యతిరేకంగా ఓట్ వేశారు.. కానీ ట్రంప్ దిగి బీడెన్ వచ్చిన తరువాత కరోనా చావులు ఇంకా పెరిగినా ఈ మీడియా బీడెన్ ను విమర్శలు నుండి కాపాడింది.
సరే ! బిడెన్ వచ్చాడు.
మళ్ళీ ఇజ్రాయెల్ – పాలస్తీనా దాడులు మొదలు.
ఆ తరువాత రష్యా ఉక్రేయన్ యుద్ధం.
అందుకే బీడెన్ ఎన్నిక ప్రపంచ చావుకు వచ్చింది.
కానీ, ఆయుధ లాబీకి పండగే.
ట్రంప్ ఉండి ఉంటే ఖచ్చితంగా రష్యా ఉక్రేయన్
వార్ వచ్చి ఉండేది కాదు. ఎందుకంటే అసలు ట్రంప్ నాటోపై అమెరికన్స్ టాక్స్ డబ్బులు ఎందుకు ఖర్చు చేయాలి అని ఆలోచన. అందుకే నాటో లోంచి బయటకు వచ్చేద్దాం అని కూడా ఒక సమయంలో అనుకున్నాడు.
కానీ ట్రంప్ ఓడిపోవడం తో , బీడెన్, నాటో కలసి ఉక్రేనియన్ ని రష్యా మీదకు రెచ్చగొట్టి, రష్యా హెచ్చరికలను ఖాతరు చేయని స్తితికి తీసుకువెళ్లారు ఉక్రేయన్ దేశాన్ని. తీరా రష్యా ఉక్రేయన్ మీద దాడి మొదలు పెట్టి ఉక్రేయన్ ని ధ్వంసం చేస్తూ ఉంటే, యుద్దాన్ని ఆపే ప్రయత్నాల బదులు ఉక్రేయన్ ని ఇంకా రెచ్చగొడుతూ, ఆ దేశానికి వెనక నుండి ఆయుధ, ధన సాయం చేస్తూ యుద్ధం ఇంకా ఎక్కువ రోజులు కోనసాగేలా చేస్తున్నారు.
ఈ యుద్ధం వల్ల క్రూడ్, గాస్, విద్యుత్, ఎరువుల ధరలు ప్రపంచం అంతా భయంకరంగా పెరిగి చిన్న దేశాల ఆర్ధిక వ్యవస్థలు అతలాకుతలం అయిపోయాయి.
అసలే చైనా వాడి గిఫ్ట్ కరోనా తో సుమారు రెండు సం. లు నానా యాతన అనుభవించిన చిన్న దేశాలు ఇంకా కుదురుకోకుండానే ఈ యుద్ధ ముప్పు ముంచుకు రావడంతో చాలా చిన్న దేశాలు అంటే మన పక్కనే ఉన్న శ్రీలంక, పాక్, బంగ్లాదేశ్, నేపాల్ అలాగే కొన్ని ఆఫ్రికా దేశాలు దివాలా అంచులుకు చేరాయి/చేరుతున్నాయి.
పోనీ యుద్ధం వల్ల అమెరికా నాటో దేశాల
ప్రజలు సుఖంగా ఉన్నారా? అంటే ఈ యుద్ధం వల్ల ఆ దేశాల్లో కూడా పెట్రోల్, గాస్,విద్యుత్, ఆహార ధాన్యాలు కొరత తో ధరలు ఆకాశాన్ని అంటుతూ ఎప్పుడూ చూడని ద్రవ్యోల్బణాన్ని చూస్తున్నాయి.
ఎప్పుడూ డాలర్ కంటే మారక విలువ సుమారు 25% ఎక్కువ వుండే యూరో ఇప్పుడు మొట్టమొదటి సారిగా డాలర్ తో సమానం అయిపోయింది.
దురదృష్టం ఏమిటంటే మోడీ+ట్రంప్ కెమిస్ట్రీ బాగా కుదిరింది అని మోడీకి ఎక్కడ పేరు వచ్చేస్తుందో అని మోడీపై ద్వేషంతో ట్రంప్ ఓడిపోయి బీడెన్ రావాలని
మన దేశ ఉదార మేధావులు చాలా కోరుకున్నారు.
ఈ మేధావులకు దేశ హితం, ప్రపంచ హితం కంటే తమ సిద్దాంతాలు మాత్రమే ముఖ్యం. అందుకే మన ఎన్నికల సమయాల్లో వీళ్ళ మాటలు సామాన్య ప్రజలు ఖాతరు చేయడం మానేసి మోడీని మళ్ళీ గెలిపించుకున్నారు.
అందుకే ప్రజలు దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోకుండా ఏవో తాత్కాలిక ప్రయోజనాలు కోసం కక్కుర్తి పడి నాయకులను ఎన్నుకుంటే తరువాత అష్టకష్టాలు పడేది ఆ ప్రజలే.
” అసలు యుద్ధం జరగకుండా చూడవలసింది.
సరే! మొదలయ్యింది. ఇప్పుడు అయినా ఆపడానికి ప్రయత్నించండి. లేకపోతే చివరకు మాట్లాడడానికి ఎవరూ మిగలరు శవాలు తప్ప ”
— అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్
….చాడా శాస్త్రి….