కొన్నేళ్ల కింద మూతపడిన సీసీఐ పునరుద్ధరణ పట్ల ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆరాటం చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉందని బీజేపీ నాయకురాలు సుహాసినీరెడ్డి అన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఒక టర్మ్ మంత్రిగా పనిచేసిన ఆయన ఆదిలాబాద్ బంద్ కు పిలుపు ఇవ్వడం అంటే ఆయన అసమర్థత అర్థమవుతోందన్నారు.
ఎప్పుడో మూతబడిన సిమెంట్ ఫ్యాక్టరీ గురించి ఇప్పుడు మాట్లాడుతున్న మీరు…..మీ చేతిలో ఉన్న రేణుక సిమెంట్ ఫ్యాక్టరీ గురించి ఎందుకు నోరు విప్పడం లేదని నిలదీశారు. జిల్లాకు మంజూరైన గిరిజన యూనివర్సిటీ, టెక్స్టైల్ పార్క్ జిల్లా నుంచి తరిలిపోతే ఏం చేసినట్టని ఆమె ప్రశ్నించారు. 2014 లోనే సేకరించిన 1600 ఎకరాలు NOC ఇవ్వకపోవడంతో Air Force Station ఏర్పాటు చేయలేకపోయారన్నారు.
Air Force Station కి అనువుగా ఉన్న దానికి అవసరమైన 1600 ఎకరాలకు రాష్ట్ర ప్రభుత్వ NOC ఇప్పించాలని సుహాసినీరెడ్డి అన్నారు.