జనసేన అధినేత పవన్ వాహనం వారాహి కాదు నారాహి అని రోజా అన్నారు. కత్తులను చేతబట్టి విన్యాసాలు చేస్తున్న పవన్ కు…ఎవరిపై యుద్ధం చేయాలో తెలియడంలేదని వ్యంగ్యంగా అన్నారు. తిరుపతిలో జరిగిన ఏపీ సమీకృత సుస్థిర పర్యాటక ప్రణాళిక అభివృద్ధిపై సౌత్ జోన్ సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఏమాత్రం ప్రజాబలం లేని పవన్ పవన్ వ్యాఖ్యలపై సీఎం జగన్ స్పందించాల్సిన అవసరం లేదన్న రోజా..మీడియా ఆ పాకేజీ స్టార్ కు అనవసర ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
హైదరాబాద్లో బతికే పవన్ శ్వాస తీసుకోవాలా వద్దా? అనేది చెప్పాల్సింది కేసీఅర్, కేటీఆర్ లని… చంద్రబాబు కోసం పవన్ పనిచేస్తున్నాడనీ ఆరోపించారు.వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాలూ గెలిచి…పవన్ ను, చంద్రబాబును హైదరాబాద్ కు పంపుతామని రోజా వ్యాఖ్యానించారు