పోలీసులను ముందుపెట్టి బీఆర్ఎస్ నేతలు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకేఅరుణ. పోలీసులు సైతం ప్రభుత్వం చెప్పినదానికల్లా తలూపడం మానుకోవాలన్నారు. జీతాలు ఇచ్చేది కేసీఆర్ కాదని ప్రజలని ఆమె అన్నారు. యూనిఫాం ఉన్నంతమాత్రాన అదిరేది, బెదిరేది లేదన్నారు. ప్రజలే కనుక తిరగబడితే ఊళ్లోకి అడుగే పెట్టలేరన్నఆమె.. యూనిఫాం తీస్తే మామూలు మనుషులేనన్న విషయం గుర్తుపెట్టుకోవాలని పోలీసులను హెచ్చరించారు.
టిఆర్ఎస్ నాయకులు దద్దమ్మల్ల పోలీసులను ముందు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు.
ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్న కొంత మంది పోలీసులు టీఆర్ఎస్ నాయకుల జీతగాళ్లలా వ్యవహరిస్తున్నారు. pic.twitter.com/i3ksLvK9lG
— D K Aruna (@Aruna_DK) January 7, 2023