తానేం దేశం పరువు తీయడం లేదని, గతంలో నరేంద్రమోడీయే దేశం బయట భారత్ పరువు తీశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. విదేశం గడ్డమీద దేశాన్ని తక్కువ చేశానని తనపై విమర్శలు చేస్తున్న వారు గతంలో మోదీ చేసిన వ్యాఖ్యల్ని గుర్తుతెచ్చుకోవాలన్నారు.స్వాతంత్ర్యం వచ్చి 60,70 ఏళ్లైనా దేశంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని మోదీ అనడం తనకు గుర్తుందన్నారు. ఆమాటలు అని ఈ దేశాన్ని ఆయన అవమానించలేదా అని బీజేపీని రాహుల్ ఎదురు ప్రశ్నించారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ అక్కడ వివిధ కార్యక్రమాలు వేదిగ్గా మాట్లాడుతున్న మాటలు వివాదాస్పదం అవుతున్నాయి. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ప్రసంగిస్తూ భారత్ లో ప్రజాస్వామ్యం లేదని రాహుల్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.