( ఉగాది సందర్భంగా డాక్టర్జీ వ్యాసం)
దేశ స్వాతంత్య్రానికి కాంగ్రెస్ సంస్థలో పనిచేస్తుండే డాక్టర్జీ ,ఏ కారణాల వల్ల దానినుండి దూరం జరుగుతూ బయటకు వచ్చి రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్నిప్రారంభించారు, బయటకు వచ్చిన డాక్టర్జీ ఒక ప్రక్క ఈ దేశ అస్తిత్వాన్ని కాపాడటానికి జాతీయ పునరుజ్జివన యజ్ఞం ప్రారంభిస్తే మరోప్రక్క కాంగ్రెస్ అందులో ప్రముఖంగా జవహర్లాల్ నెహ్రు ఈ దేశ అస్తిత్వానికి ఎట్లా సవాళ్లు విసురుతూవుండేవాడు ,దానితో కాంగ్రెస్ కు RSS అంటే ఒక మతతత్వ సంస్థ ముస్లిం వ్యతిరేకి అనే ముద్రవేస్తూ ప్రచారం చేస్తూవుండేవారు. ఆ నెహ్రు ,డాక్టర్జీ ఇరువురు కూడా ఒకే సంవత్సరం జన్మించారు.స్వాతంత్ర్యానంతరం నెహ్రు ఎట్లా ప్రతిష్టను క్రమంగా కోల్పోతూ వివాదాస్పదమైనారు,డాక్టర్జీ ప్రారంభించిన సంఘం ఎట్లా దేశానికే క్రమంగా కేంద్ర బిందువు గా మారుతున్నది, వాటి వివరాలు చూద్దాం.
ఈ దేశ చరిత్ర గతిని మలుపులు త్రిప్పిన ఆ ఇద్దరి ఆలోచనలు
ఈ దేశ చరిత్ర గతిని మలుపులు త్రిప్పిన ఆ ఇద్దరు . 1889 సంవత్సరంలో జన్మించారు. అందులో ఒకరు డాక్టర్ కేశవరావు బలిరాం పంత్ హెడ్గేవార్ , వారు 1889 ఏప్రిల్ ఒకటో తేదీన నాగపూర్ లో జన్మించారు, ఆరోజు ఉగాది పండుగ. రెండవ వారు దేశ స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించి పదహారు సంవత్సరాలు ఈ దేశ ప్రధాని మంత్రిగా ఉన్న పండిట్ జవహర్లాల్ నెహ్రూ. వారు 1889 నవంబర్ 14వ తేదీ జన్మించారు. రాజకీయ అధికారమే సర్వస్వము గా భావించిన జవహర్లాల్ నెహ్రూ తనదైన శైలిలో పనిచేసుకుంటూ వెళ్లారు. స్వతంత్ర పోరాటం సమయంలో బ్రిటిష్ వాళ్ళ యొక్కభేద తంత్రంలో పడిపోయి ఈ దేశం యొక్క అస్తిత్వాన్నే నామరూపాలు లేకుండా చేయాలని ప్రయత్నించారు. వందల సంవత్సరాలు నిరంతర సంఘర్షణలో నిలబడి పోరాటం చేసిన హిందూ సమాజం యొక్క అస్తిత్వాన్ని కాపాడేందుకు ఒక సుదీర్ఘ ప్రణాళి క కు తెర లేపిన వారు డాక్టర్ కేశవరావు బలిరాంపంత్ హెడ్గేవారు. వారు ఇరువురి శతజయంతి 1889 – 90 మధ్యకాలంలో జరిగింది. ఆ సమయంలో జగత్ ప్రసిద్ధులైన జవహర్లాల్ నెహ్రూఒకప్రక్క , మరో ప్రక్క రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సేవకులు సంఘఅభిమానులకు మాత్రమే పరిచయం ఉన్న డాక్టర్ జి. ఈ శత జయంతి ఉత్సవాలతో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ నిర్మాతగా డాక్టర్ జి ప్రపంచ వ్యాప్తంగా పరిచయమయినారు . ఇరువురి శతజయంతి గమనించినట్లయితే జవహర్లాల్ నెహ్రూ శతజయంతి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నామమాత్రంగా నిర్వహిస్తే, డాక్టర్జీ శతజయంతి దేశ విదేశాల్లో రాష్ట్రయస్వయంసేవక సంఘ్ నభూతో న భవిష్యతి అన్నట్లుగా కార్యక్రమాలు నిర్వహించింది. 1989వ సంవత్సరం తర్వాత డాక్టర్ జి పేరు గతం కంటే ఎక్కువ ప్రాచుర్యంలోకి రావడం, డాక్టర్ జి ప్రారంభించిన సంఘాన్నిప్రపంచంలో అనేక మంది అధ్యయనం చేయటం ప్రారంభించారు. సంఘాన్ని విమర్శించే వాళ్ళు, మెచ్చుకునేవాళ్ళు సంఘానికి సానుభూతి చూపించేవాళ్ళు ఇట్లా అనేక మంది ఈరోజు దేశమంతా మనకి కనబడుతూ ఉంటారు. ఎవరు ఏం చేసినా డాక్టర్ జి ని స్మరించుకోవటం అనేది జరుగుతోంది. జవహర్లాల్ నెహ్రూ శతజయంతి తరువాత . నెహ్రూ చేసిన చారిత్రక తప్పిదాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటికి రావడం దానిపై దేశవ్యాప్తంగా చర్చలు ప్రారంభమైనాయి , ఆ రోజుకి ఈరోజుకి కాంగ్రెస్ ఆలోచనలలో వ్యవహారంలో ఏమి మార్పు రాలేదు పైగా ఆ కాలంలో ఈ రోజుల్లో కూడా కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలు, సిద్ధాంతాలు ఇప్పటికీ ఈ దేశ సమైక్యతకు భంగం కలిగిస్తూనే ఉన్నాయి . ఈ దేశ అస్తిత్వానికి సవాళ్లు విసురుతూనేఉన్నాయి. దాని కారణంగా జరుగుతున్న నష్టం ఈ దేశం గుర్తిస్తున్న సమయం ఇది, దాంతో కాంగ్రెస్ ప్రతిష్ట జవహర్లాల్ నెహ్రూ ప్రతిష్ట క్రమంగా దిగజారుతూ ఒక వివాదాస్పద ముగా మారు తున్నది. డాక్టర్జీ ప్రారంభించిన సంఘం ఈ రోజున హిందూ సమాజానికి కేంద్ర బిందువుగా నిలబడుతున్నది. ఏ ఆలోచనల వల్ల కాంగ్రెస్ నేహ్రు ల ప్రతిష్ట దిగజారుతూ వివాదాస్పదంగా మారుతున్నది , ఏ కారణాల వల్ల ఆర్ఎస్ఎస్ దేశమంతా అంగీకరించేస్థితికి చేరుకొంటున్నది ఆ విషయాలు తెలుసుకోవాలంటే కాంగ్రెస్ ఆలోచనలు సంఘ ఆలోచనలు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. .
ఇది హిందూరాష్ట్రం – ఒక వాదా తీత సత్యం
అసలు ఈ దేశం ఎవరిది ?ఏ ఆలోచనలు ప్రపంచానికి శాంతిని అందించింది.? అట్లా వేల సంవత్సరాల ఘన చరిత్ర ఎవరికీ ఉన్నది ? అటువంటి చరిత్ర ఈ దేశానికె ఉన్నది అటువంటి ఈ దేశాన్ని ఒక దేశం కాదని బ్రిటిష్ వాడు తన అవసరార్థం సిద్ధాంతికరించి ప్రచారం చేస్తే ఆంగ్ల విద్యను అభ్యసించిన వాళ్ళు ఆంగ్లేయుల ప్రచారాన్ని నెత్తికెక్కించుకొని వాళ్లకంటే ఎక్కువగాఇది ఈ దేశం ఒక దేశం కాదు, ఒక జాతి కాదు అని మాట్లాడటం ప్రారంభమైపోయింది, అది ఒక ఫ్యాషన్ గా కూడా మారిపోయింది, దానిని కాంగ్రెస్ నేతలు పూర్తిస్థాయిలో భుజానికి ఎత్తుకొని ప్రచారం చేసారు.కాబట్టే రాజ్యాంగం లో ఈ దేశానికి ఏమి పేరు పెట్టాలని చర్చ తలెత్తింది, ఆ చర్చలలో ఈ దేశానికి ఇండియా అని పేరు పెట్టారు, దానిపైన పెద్ద చర్చ జరిగిన కారణంగా మన అదృష్టం బాగుండి INDIA THAT IS BHARAT అని పేరు మార్చారు. ఈ స్థితి ఎందుకు వచ్చింది, అసలు వాస్తవం ఏంటి గమనించవలసిన అవసరం ఉంది. ఆ విషయాలను డాక్టర్ హెడ్గేవర్ జి స్వయంగా చెప్పిన మాటలలో చూద్దాం. ”డాక్టర్ జి ఇది హిందూ రాష్ట్రము అని ప్రకటించారు, ఇది వాదాలకు అతీతమైన ఒక సత్యం అని ప్రకటించారు, డాక్టర్ జి కి ప్రేరణం ఈ రాష్ట్ర భక్తి అవటంవల్ల విదేశీయులైన ఆంగ్లేయులను నిరోధించడమే ఏకైక కార్యము అనే దృక్పథం వారికి రాలేదు, భక్తితో పూజించే ఈ రాష్ట్రం యొక్క స్వరూపము ఈ మౌలిక విషయాలను లోతుగా అధ్యయనం చేశారు, హిందూ జీవనము త్రికాల బాధిత సత్యంగా వారికి సంపూర్ణంగా సాక్షత్కరించింది , సమకాలీన సమయంలో ప్రచారంలో ఉన్న అనైతిహాసికత, మరియు అసత్యము అయినా కలగూరగంప రాష్ట్ర వాదము బుద్ధికి తర్కానికి అందనిది విశుద్ధ రాష్ట్ర భావనకు విరుద్ధమైనది, రాష్ట్రీయ సమాజాన్ని దాని శత్రువులను విదేశీ ఆక్రమణదారులను వాటి నుండి స్వదేశాన్ని సమాజాన్ని జీవన వైశిష్ట్యాన్ని రక్షించుకోవడానికి ప్రాణాలొడ్డి పోరాడే వారిని గుర్తించడంలో పొరపాటు జరిగింది, ఈ భ్రమలతో పనిచేస్తునంత కాలం మన దేశం మహా అనర్థాల పరంపర ఎదుర్కోవాల్సి వస్తుంది, కాబట్టి సదా దీనిని శ్రేష్ఠస్థితిలో ఉంచుతాము అని ప్రకటించారు. ఇది హిందూ రాష్ట్రము అనేది ఒక వాదాతీతమైన సత్యం అని ఈ రోజున దేశమంతా గుర్తించటం మనకు కనపడుతోంది సుప్రీం కోర్ట్ అనేక సందర్భాల్లో హిందుత్వం అంటే ఒక జీవన విధానం అని తన తీర్పుల్లో పేర్కొనటం కూడా మనం గమనించవలసిన అవసరం ఉన్నది. ఈమధ్య హర్యానా దగ్గరలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘం యొక్క అఖిల భారత ప్రతినిధి సభ జరిగింది ఆ సభ అనంతరం rss సర్ కార్యవాహ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఒక మాట చెప్పారు ఇది హిందూ రాష్ట్రము అనేది సాంస్కృతిక పరమైనది, ఇది హిందూ రాష్ట్రము అని చెప్పేందుకు రాజ్యాంగం మార్చాల్సినఅవసరం లేదని చెప్పారు ఇది హిందూ రాష్ట్రము గానే ప్రపంచమంతా గుర్తిస్తున్నది.
ఈ వితర్కాలు కుట్రలు ఎలా చోటు చేసుకొన్నాయి ?
అసలు ఇటువంటి ప్రశ్నలు మన సమాజంలో ఎందుకు తలెత్తే తున్నాయి అనేది తెలుసుకోవాలంటే మనం చరిత్రను ఒకసారి గమనించవలసిన అవసరం ఉంది. బ్రిటిష్ ప్రభుత్వం నిర్వహించిన రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ తర్వాత బ్రిటిష్ ప్రధాని వాగ్దోనాల్డ్ ఒక ప్రకటన చేశారు ”అన్ని వర్గాలకు తృప్తినిచ్చే ఏదైనా ఒక ప్రణాళికను మీరు సూచించకపోతే ప్రభుత్వమే ఆ పని చేయవలసి వస్తుంది, ప్రజాస్వామ్యం పేరిట అధిక సంఖ్యాకులు పశువులంతో అల్పసంఖ్యాకులను అణచకుండా అవసరమైన అంకుశాలను సృష్టించవలసి వస్తుంది అని ప్రకటించాడు. 1932 ఆగస్టు 17వ తేదీ నాడు బ్రిటిష్ ప్రధాని తాను అనుకున్నట్లు కమ్యూనల్ అవార్డును ప్రకటిం చాడు . అవార్డు ప్రకారం ఈ దేశ ప్రజలను 1) హిందువులు2) ముస్లింలు 3) సిక్కులు 4) దళితులు5)భారతీయ క్రైస్తవులు 6) యూరోపియన్ లు అంటూ విభజించి వారికి రిజర్వేషన్లు ప్రత్యేకించి కేటాయించారు. ఇది దేశ విభజనకు సంకేతంగా మారిపోయింది దీనిని కాంగ్రెస్ గాని నెహ్రుగాని ప్రతిఘటించలేదు, దాని భవిష్యత్తు పరిణామాలు ఎట్లా ఉంటాయి అని కూడా ఆలోచించలేదు కానీ డాక్టర్జీ . ఈ అవార్డు చూసిన తర్వాత దానిని తీవ్రంగా వ్యతిరేకించారు, ఈ అవార్డు రానున్న ఆపదలకు గుర్తుగా వారు గుర్తించారు దాని పరిణామం ఆ తదుపరి కాలంలో దేశవిభజనలో మనం చూశాం.
ఆంగ్ల విద్య అనేక అనర్ధాలకు కారణం
1857 స్వాతంత్ర సంగ్రామం తర్వాత బ్రిటిష్ వాళ్లకు ఈ దేశ స్వభావం బాగా అర్థమైంది ఇక్కడ తమ ఉనికికి సవాలు తుదిగా ఎదురయ్యేది ఈ దేశంలో నివసిస్తున్న అనాది ప్రజలు అంటే హిందువుల నుండే హిందువులు మేల్కొన్న నాడు విదేశీ శక్తులు ఏవైనా ఎంత బలంతో మోహరించిన ఎదిరించి నిలవడం సాధ్యమా? ఈ గుణపాఠంతో బ్రిటిష్ తంత్రజ్ఞులు ఈ దేశాన్ని ఉపఖండం, ఇక్కడ నివసించే ప్రజలందరూ బయట నుండి వచ్చిన వాళ్లేనని పాఠాలు మనతో దిద్దించరు, ఇక్కడ చరిత్ర మార్చి తమ సామ్రాజ్యవాదానికి విస్తరణ వాదానికి అనుకూలంగా తయారు చేసుకున్నారు. 1851లో బ్రిటిష్ ప్రభుత్వం భారత దేశంలో దేశీయ విద్యా విధానాన్ని గురించి సమగ్ర సమాచారాన్ని సేకరించి ఆ సమాచారం ప్రకారం ఆనాటి బ్రిటిష్ విద్యా విధానం కంటే ఇది ఎంతో శ్రేష్టమైనదని వాళ్లకు అర్థమైంది, అయినామనదేశ విద్యా విధానాన్ని రద్దుచేసి దానికి గుర్తింపు లేకుండా చేసి ఒక నూతన విద్యా విధానం ప్రవేశపెట్టారు, బ్రిటన్ లో ఉన్న పరిపాలన పద్ధతిని కూడా ఇక్కడ ప్రవేశపెట్టాలని ఈ దేశ ప్రజలు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలు అనే రెండు వర్గాలుగా సృష్టించి ఇక్కడి వ్యక్తుల ద్వారా ఇక్కడ ప్రజల నుండి అధికంగా ఆదాయం రాబట్టుకోవాలని బ్రిటిష్ వాళ్ళు కుట్రలు పన్నారు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని బ్రిటిష్ జీవన స్థాయిని కీర్తిస్తూ అనుకరిస్తూ దేశీయమైన దేనినైనా పశ్చిమ సమాజాలతో పోల్చి భారత్ ను కించపరిచే విధంగా, నీచంగా కనబడే ధోరణిలో అంచనాలు వేస్తూ బ్రిటిష్ సామ్రాజ్యసుస్థిరత్వాన్ని కాపాడేందుకు సిద్ధంగా ఉండే జనాన్ని సృష్టించాలని ఈ నూతన విద్యా విధానం సంకల్పించింది. ఈ మాటలని 1931 అక్టోబర్ 20వ తేదీ నాడు లండన్ లో గాంధీజీ ఇచ్చిన ఉపన్యాసంలో చెప్పబడింది.
డాక్టర్ జి రానున్న ఆపదలను గుర్తించి దేశాన్ని తీవ్రంగాను సూటిగాను హెచ్చరిస్తూ ఉండేవారు హిందుత్వాన్ని వ్యతిరేకించేవారు మూడు శక్తులు 1) ఏదో విధంగా ముస్లింలను కలుపుకుంటే గాని దేశానికి తామే ప్రతినిధులమనే గుర్తింపు రాదు అనే భ్రమలో ఉండేవారు 2) యూరోపియా విద్యా వ్యామోహంతో ఈ దేశ మౌలిక తత్వాన్ని గుర్తించలేక హైందవం కూడా ఇస్లాం క్రైస్తవం వలే ఒక పిడివాద మత వర్గం అనే భావన కలవాళ్ళు ఈ రకం మనుషులలో అనేకమంది ఆంగ్లేయులకు విధేయులు 3) మూడవ వర్గం మొదటి నుంచి హిందువులకు హిందూ దేశ ఆ ఖండ స్వరూప సంరక్షణకు శత్రువులు. దేశం యొక్క అఖండత్వానికి ఈ ముగ్గురి వల్లే ప్రమాదం ఏర్పడుతుంది అని డాక్టర్ జి హెచ్చరించారు.
రాజకీయాలకు అతీతం గ సామజిక శక్తే అవసరం
స్వాతంత్ర పోరాటానికి ఒక వేదికగా ప్రారంభమైన కాంగ్రెస్ క్రమంగా రాజకీయ పార్టీగా రూపాంతరం చెందుతూ వచ్చింది, రాజకీయాలతోనే అన్ని సాధించవచ్చు, అవే సర్వస్వం అని భావిస్తూ కాంగ్రెస్ నెహ్రు వ్యవహరించినటువంటి తీరు దేశానికి చాలా నష్టం కలిగించింది. డాక్టర్ జి ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి రాజకీయాలకు అలిప్తంగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్నిప్రారంభించారు , హిందూ సమాజంలో ఒక సామాజిక శక్తి, ధార్మిక శక్తిని నిర్మాణం చేయటానికి కృషి చేశారు దేశ ఉజ్వల భవిష్య్తతుకు ఈర్షలతో నిండి ఉండే రాజకీయాలు ఉపయుక్తం కావని ఈ విషయంలో తగు జాగ్రత్త తీసుకొని పక్షంలో అవి దేశానికి హానికరం కూడా కావచ్చు అని డాక్టర్జీ , హెచ్చరిస్తూ ఉండేవారు. రాష్ట్రం యొక్క భవిష్యత్తు నిర్మాణం కొరకు అనుశాసనం సంఘటితమైన సామర్థ్యాన్నిసమాజం లో నిర్మాణం చేయాలి నిర్ణయించారు. అందుకే రాష్ట్రీయ స్వయం సంఘ ప్రారంభించారు . ఈ రోజు ఆ డాక్టర్జీ ఆలోచనలే సరియైన వని నిరూపించి బడుతోంది. అది డాక్టర్జీ దూరదృష్టి