[ ప్రపంచ మత మహా సమ్మేళనం సభను నిర్వహించిన నిర్వాహకుడు హెన్రీ బారోన్ ముందుగానే క్రైస్తవం అన్ని మతాల కంటే శ్రేష్టమైనది అని ప్రకటించాలని నిర్ణయించుకున్నాడు,కానీ ప్రకటించ లేకపోయాడు, ఆ విషయాన్ని తన డైరీలో ఇలా వ్రాసుకున్నాడు” స్వామి వివేకానంద క్షణాల్లో సభికులను ఉల్లాస పరిచి సమ్మోహితులను చేసి కరతాళ ధ్వనులు చేయించాడు, ఆ సభల లక్ష్యాన్ని మార్చివేశాడు, వాస్తవంగా వివేకానందుడు మాట్లాడేందుకు రెండు నిమిషాల సమయం మాత్రమే ఇవ్వబడింది, ఆ రెండు నిమిషాల సమయంలో 471 పదాలు మాట్లాడు, ఆ రెండు నిమిషాల సమయం ఆ సభ నిర్ణీత అంశాలను పూర్తిగా మార్చి వేసింది.]
అమెరికాలోని చికాగో పట్టణంలో ప్రపంచ మత మహా సమ్మేళనం నిర్వహించి ఈరోజుసెప్టెంబర్ 11 కి 128సంవత్సరాలు పూర్తి అయ్యి 129వ సంవత్సరంలో అడుగు పెడుతున్నది . ఆ ప్రపంచం మత మహా సమ్మేళనం ఏర్పాటుకు నేపథ్యాన్ని తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది, ప్రపంచంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలు 1767 సంవత్సరంలో ఏర్పడి దానికి రాజ్యాంగం 1787 సంవత్సరం నుండి అమలులోకి వచ్చింది. వంద సంవత్సరాలు అయిన సందర్భంగా అమెరికా దేశం శాస్త్ర సాంకేతిక రంగాలలో సాధించిన ప్రగతిని పెద్ద ఎత్తున ఉత్సవాలు ఏర్పాటు చేసుకున్నది, ఆ సమయంలో ప్రపంచంలో అమెరికా అగ్రదేశం గా ఎదుగుచున్నది. అట్లాగే క్రైస్తవం ప్రపంచ మతాలలో అగ్రస్థానం అని నిరూపించు కుందామని వాళ్లకు అనిపించింది, దాని కార్యాచరణే ప్రపంచ మత మహా సమ్మేళనం, ఈ ప్రపంచ మత మహా సమ్మేళనం ఎవరు ఏర్పాటు చేశారు? ఇది ఏర్పాటు చేసింది చికాగోలోని ప్రెస్బిటేరియన్ క్యాథలిక్ చర్చి వారు, ప్రపంచం లో మా మతమే శ్రేష్టం మాదే ఆధిపత్యం అని విర్రవీగుతున్న క్రైస్తవ ప్రపంచానికి ఆధ్యాత్మిక జ్ఞానమే గొప్పది అనే సత్యాన్ని అర్థం చేయించి ప్రపంచ చరిత్రను మలుపు తిప్పిన సందర్భం అది. అట్లాగే ఆ ప్రపంచ మత మహా సమ్మేళనం లో భారతీయ ఆధ్యాత్మిక జ్ఞానం ఎంతో అద్భుతమైనది అని ప్రపంచానికి పరిచయం చేసి ప్రపంచ ప్రజల కళ్ళు తెరిపించి వాళ్ళ మనసులు చూరగొన్న స్వామి వివేకానందుని ప్రపంచానికి, భారతదేశానికి పరిచయం చేసిన అద్భుత నేపథ్యం ఉన్న సంఘటన అది, ఈ సందర్భంగా ఈ నేపథ్యానికి వివేకానందుని జీవితం మలుపు తిప్పిన సందర్భాన్నికూడా జ్ఞాపకం చేసుకోవడం ఎంతో అవసరం.
రామకృష్ణ పరమహంస ఈ లోకాన్ని వదిలి పెట్టిన తర్వాత వారి శిష్యుల పరిస్థితి క్రమంగా దయనీయంగా మారుతున్న సమయంలో వారి నివాసం కూడా మార్చుకోవలసి వచ్చింది, ఆ సమయంలో వివేకానందుడు ఎంతో అంతః సంఘర్షణకు లోనైనాడు, ఒకరోజు అకస్మాత్తుగా భారతదేశ భ్రమణం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు, వెంటనే శిష్యుల బాధ్యత ఒక శిష్యుడు అప్పగించి వెంటనే బయలుదేరాడు, ఒకవేళ వివేకానందుడు ఆ సంకల్పం చేసుకుని దేశ భ్రమణం చేసి ఉండకపోతే మనకు ప్రేరణ దాయకం కాకపోయేవాడు . వివేకానందుడు ఒక అనామకుడు గా దేశమంతా తిరుగుతున్నప్పుడు దేశంలోని పరిస్థితులు తనకు ఎదురైన అనుభవాలు అతని మనస్సు ఎంతో క్షోభకు గురిఅయింది. ఆయన కన్యాకుమారి చేరుకున్నప్పుడు ఇప్పుడు సముద్రంలో వివేకానంద శిలా స్మారకం ఉన్నా శిలపై మూడు రోజులు అంతర్ముఖం అయినాడు,
, ఆ సమయంలో వివేకానందుడి గురువైన రామకృష్ణ పరమహంస ఆదేశానుసారం ప్రపంచం మతమహా సమ్మేళనానికి సన్నాహాలు ప్రారంభం చేసుకున్నాడు.
ఏ నేపథ్యంలో వివేకానందుడు సిద్దమైనాడు ? ఆ రోజుల్లో దేశం తీవ్ర దుర్భిక్ష పరిస్థితులుఎదుర్కొంటున్నది బహుశా భారతదేశ చరిత్రలో ఇటువంటి సందర్భాలు ఎప్పుడూ లేవు, ఆకలి బాధతో ఈ దేశ ప్రజలు అలమటిస్తున్న రోజులవి, నిరక్షరాస్యత వంటి అనేక సమస్యలతో దేశం సతమతమవుతోంది , ఎంతటి దయనీయ పరిస్థితులు ఉన్నాయి అంటే మనపై మనకు ఉన్న విశ్వాసం కోల్పోతున్నాం, పరాజయం పాలైన జాతి , ఇటువంటి పరిస్థితుల్లో స్వామి వివేకానంద భారతదేశం నుండి అమెరికా ప్రయాణం, దానికి ఎంచుకున్నది ప్రపంచ మత మహా సమ్మేళనం, ఈ జాతి కోల్పోయిన పరస్పర విశ్వాసాన్ని తిరిగి నిర్మాణం చేయటమే వివేకానందుడి లక్ష్యం. ఆ సమ్మేళనం లో పాల్గొనేందుకు ఆయన దగ్గర ఎటువంటి గుర్తింపు పత్రాలు లేవు, ఆహ్వానం లేదు, అప్పటికే భారతదేశం నుండి బ్రహ్మ సమాజం మొదలైన అనేక మతాల వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. ఆ సమ్మేళనం కంటే ముందు వివేకానందుడు అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ వైట్ ను కలుసుకుని 30 నిమిషాల సేపు మాట్లాడారు,ఆ మాటలు విన్న ఆ ప్రొఫెసర్ వివేకానందుడి అద్భుత జ్ఞానానికి ముగ్ధుడై ఆ సమ్మేళనం నిర్వాహకులకు ఒక ఉత్తరం రాశాడు. అందులో” నేను ఈ ఉత్తరం ద్వారా మీకు పరిచయం చేస్తున్న వ్యక్తి ఎటువంటి వాడు అంటే అమెరికాలోని మేధావుల అందరిని ఒక దగ్గర పోగేస్తే వారిలో ఉన్న మేధాశక్తి , జ్ఞానం కంటే గొప్ప జ్ఞానవంతుడు అని ”వ్రాశాడు. ఆ ఉత్తరమే వివేకానందుని సభలో మాట్లాడేందుకు అవకాశం కల్పించింది, ఆ సభలో ఒక మతానికి ప్రతినిధిగా కాకుండా ఒక ఆధ్యాత్మిక వేత్త గా, ఒక పరివ్రాజకుడుగా పాల్గొన్నాడు. ప్రపంచం మత మహా సమ్మేళనానికి ముందు అమెరికాలోని న్యూయార్క్ లో ఒక సభలో ప్రసంగించారు, ఆ ప్రసంగం ఆ రోజుల్లో న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ప్రచురించబడింది.
ప్రపంచ మత మహా సమ్మేళనం సభను నిర్వహించిన నిర్వాహకుడు హెన్రీ బారోన్ ముందుగానే క్రైస్తవం అన్ని మతాల కంటే శ్రేష్టమైనది అని ప్రకటించాలని అనుకున్నాడు,కానీ ప్రకటించ లేకపోయాడు, ఆ విషయాన్ని తన డైరీలో ఇలా వ్రాసుకున్నాడు” స్వామి వివేకానంద క్షణాల్లో సభికులను ఉల్లాసపరిచి సమ్మోహితులను చేసి కరతాళ ధ్వనులు చేయించాడు, ఆ సభల లక్ష్యాన్ని మార్చివేశాడు, వాస్తవంగా వివేకానందుడు మాట్లాడేందుకు రెండు నిమిషాల సమయం మాత్రమే ఇవ్వబడింది, ఆ రెండు నిమిషాల సమయంలో 471 పదాలు మాట్లాడు, ఆ రెండు నిమిషాల సమయం ఆ సభ నిర్ణీత అంశాలను పూర్తిగా మార్చి వేసింది. ” ఆ విషయాన్ని 2008 ఫిబ్రవరి 22న యూనిటెరియన్ చర్చికి సంబంధించిన ఒక శిక్షణా కార్యక్రమంలో వివరించబడింది. ఆ సమ్మేళనం లో వివేకానందుడు ” విశ్వ మానవత్వం” గురించి మాట్లాడు అట్లా ఆ సభకు ఒక కీలకమైన వ్యక్తి గా మారిపోయాడు. ఒక బీద దేశం నుండి వచ్చిన స్వామి వివేకానందుడు ఆ సభను ఆధ్యాత్మిక జ్ఞానం వైపు మళ్ళించాడు, వివేకానందుని ఆధ్యాత్మిక దృష్టి కోణంతో నే అర్థం చేసుకోవాలని చెప్పబడింది.
ఆ సమయంలో అమెరికాలోని అత్యంత ధనవంతుడైన రాక్ఫెల్లర్ వివేకానందుని దగ్గరకు వచ్చాడు, ఆయనలోని నిర్భయత్వం చూసి రాక్ఫెల్లర్ఎంతో ఆశ్చర్యపోయాడు, ఎందుకంటే ఒక గొప్ప ధనవంతుడు సమక్షంలో తాను ఉన్నాననే భావన వివేకానందుడు లో కలగకపోవడం ఆయనకు ఎంతో ఆశ్చర్యం కలిగించింది. ఆ రాక్ఫెల్లర్ వివేకానందుని గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ మళ్ళీ ఆ మరునాడు కూడా వివేకానందుని దగ్గరకు వచ్చాడు , ఆ సమయంలో వివేకానందుడికి ఒక చెక్ ఇచ్చాడు, వివేకానందుడు ఆ చెక్కు తీసుకుని పక్కన పెట్టాడు, చెక్ ఇచ్చినందుకు తనకు కృతజ్ఞతలు చెప్పక పోవడానికి రాక్ఫెల్లర్ దిగ్భ్రాంతికి లోనయ్యాడు, అదే విషయాన్ని వివేకానందుని అడిగాడు ”స్వామి చెక్ ఇచ్చినందుకు మీరు కనీసం ధన్యవాదాలు కూడా చెప్పలేదు ఏమిటి అని ప్రశ్నించాడు, దానికి వివేకానందుడుచిరుదరహాసంతో’’ నేను ఎటువంటి నాగరికత కలిగిన దేశం నుండి వచ్చాను అంటే దానం స్వీకరించిన వ్యక్తికి దానం ఇచ్చిన వారే ధన్యవాదాలు చెప్పుతారు, అటువంటి నాగరికత మాది అని చెప్పాడు . అది స్వామిజీ నిర్భయత్వం ఆ తర్వాత రాక్ఫెల్లర్ కొద్దిసేపు సంభాషించాడు. రాక్ఫెల్లర్ ను అర్థం చేసుకున్న వివేకానందుడు ఆయనను ఒక ప్రశ్న అడిగాడు ఎందుకు సంపదనంతా నువ్వే పోగు చేసుకుంటున్నావు? ఈ ప్రశ్న పర్యవసానమే రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ ఏర్పాటుకు దారి తీసింది, అది వివేకానందుడి సూక్ష్మగ్రాహ్యత, వ్యక్తుల హృదయాలను ఎలా జయస్తారో చెప్పేందుకు ఇది ఒక మంచి ఉదాహరణ. వివేకానందుడి గొప్పతనాన్నిబారోస్ ఇంకా ఇలా వ్రాసాడు ” ఆ సభలో వివేకానందుడు ఇచ్చిన మూడు ఉపన్యాసాలు నిస్సందేహంగా అమెరికా ప్రజలను ఆలోచనలో పడేసింది, ఆనాటి పత్రికలు విశేషంగా పేర్కొన్నాయి. వివేకానందుని ఆ ప్రసంగాలు ఎంతో ఉన్నతమైనవి, ఎంతో లోతైన వి, అన్ని మతాల లోని మంచి తనమే విశ్వ మానవత్వం అని వ్రాశారు, ఈయన ఒక నిండైన విగ్రహం అని వ్యాఖ్యానించారు. బయటకు వచ్చిన తర్వాత స్వామీజీతో ఒక వ్యక్తి మీలాంటి జ్ఞానులు ఉన్న దేశానికి మా మిషనరీ లను పంపేది, మీ దగ్గర నుండి మా కళ్లు తెరిపించేందుకు అనేకమంది రావాలని ఆయన కోరాడు, అది ప్రపంచాన్ని శాసించగల భారతీయ ఆధ్యాత్మిక శక్తి. వివేకానందుడు ఆ సమయంలోభారత్ భవిష్యత్ గురించి ఏమి చెప్పాడో ఒకసారి చూద్దాం ”భవిష్యత్తులో కి చూడటానికి నేను ధైర్యం చెయ్యను, ఇష్టపడను, కానీ నాకు ఒక అద్భుత దృశ్యం కండ్ల ముందు స్పష్టంగా కనబడుతోంది మన తల్లి భారతమాత జాగృతమవుతోంది గతంకంటే ప్రభావవంతంగా సింహాసనంపై కూర్చుని ప్రపంచానికి శాంతిని, శుభాశీస్సులు అందిస్తున్నది. ఈ మాటలు చెప్పిన సమయం ఎటువంటిది? భారతదేశం బలహీనమైనది ఐ సి యూ లో ఉన్నది అని అందరూ అంటున్న సమయం, వివేకానందుడు ఆ మాటలు చెప్పి నూట ఇరవై నాలుగు సంవత్సరాలు గడుస్తున్నది ,
ఈ నూట ఇరవై నాలుగు సంవత్సరాలలో మనం ఎక్కడ ఉన్నాం? ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం అవసరం ప్రస్తుతం భారత్ ఎట్లా ఉన్నది? ఈ విషయాన్ని మన వాళ్ళు చెప్పిన దానికంటే బయట వాళ్ళు చెప్తేనే మన వాళ్ళు వెంటనే నమ్ముతారు అట్లా అమెరికా కుబంధించిన సి.ఐ.ఏ ఇంటెలిజెన్స్ విధాన నిర్ణేతలు 2012 డిసెంబర్ 12న రాబోవు రోజుల్లో ప్రపంచంలో ఏ దేశాలు శక్తివంతంగా ఉంటాయి చర్చించి ఒక నివేదిక తయారు చేశారు, ఆ నివేదిక ప్రకారం ప్రపంచంలో 2030 నాటికి మూడు అగ్రరాజ్యాలు ఉంటాయి అని చెప్పారు అందులో1)అమెరికా 2) చైనా 3 ) భారత్. ఈ దిశలో భారత్ వేస్తున్న అడుగులు మనం జాగ్రత్తగా గమనించవలసిన అవసరం ఉన్నది, ఈరోజు భారత్ ప్రపంచ పరిస్థితులను మలుపు తిప్పే కీలక దేశంగా పరిణతి చెందుతున్నదనే విషయం మనకు అర్థమవుతోంది . ఈరోజు అమెరికా పరిస్థితి, చైనా దుందుడుకు స్థితి, ప్రపంచ దేశాలను ఆలోచింపజేస్తున్నది . ఈపరిస్తితులలో భారత్ ఎదగాలని ప్రపంచ దేశాలు ఆకాంక్షిస్తున్నాయి . స్వామి వివేకానంద చేప్పినట్లు భారతదేశం ప్రపంచానికి శాంతిని అందించే దేశంగా నిర్మాణం కావటం మన కండ్ల ముందు కనబడ బోయే దృశ్యం. భారతదేశం ఎప్పుడైనా ఆధ్యాత్మిక జ్ఞానం తోనే శక్తివంతంగా నిలబడుతుంది. ప్రస్తుతం మన దేశానికి సంబంధించిన సాధు సంతులు ప్రపంచమంతా తిరుగుతూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తున్నారు, అదే రాబోవు రోజుల్లో ప్రపంచ గతి ని మార్చేది. అందుకే వివేకానందుడు ప్రపంచ చరిత్రను ఒక కీలకమైనమలుపు తిప్పిన వ్యక్తిగా ప్రపంచమంతా ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది.