షీ టీంలో ఉన్న పోలీసులకు ద్విచక్రవాహనాలు అందచేసింది ప్రభుత్వం. ఆ ద్విచక్రవాహనాలపై తిరుగుతూ మూడు కమిషనరేట్ల పరిధుల్లో రోడ్లపై ప్రధాన కూడళ్లు, బస్స్టాపుల్లో నిఘా పెట్టి పోకిరీల భరతం పట్టనున్నారు. గోషామహల్ స్టేడియంలో షీటీమ్ పోలీసులకు 60 టూవీలర్లు అందచేశారుహోం మంత్రి మహమూద్అలీ. షీటీమ్లు ఈ వాహనాలపై తిరుగుతూ నిమిషాల వ్యవధిలో పోకిరీల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తాయని సీపీ అంజనీకుమార్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మూడు కమిషనరేట్ల పరిధుల్లో 6.50 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటుచేయనున్నట్టు చెప్పారు..షీటీమ్స్ వ్యవస్థను 2014లో ప్రారంభించారు..