20 ఏళ్ల నాటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 స్థానంలో వర్తమాన కాలానికి అనుగుణంగా “కొత్త డిజిటల్ చట్టం” తీసుకురావాల్సిన అవసరం ఉందని కేంద్ర ఐటీశాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. అన్నారు. నాస్కామ్ వార్షిక ఈవెంట్ ఇండియా లీడర్షిప్ ఫోరమ్ 2022లో ఆయన మాట్లాడారు. సిటిజన్స్ ప్రైవసీ రైట్ ను పరిగణలోకి తీసుకునేలా…కాలానికి అనుగుణమైన కొత్త డిజిటల్ చట్టం ఉండాల్సిన అవసరం ఉంది” అని అన్నారు. మూడేళ్లుగా నత్తనడకన సాగుతున్న ‘డేటా ప్రొటెక్షన్ బిల్లు’ను ప్రస్తావించారు. అధికారులు హడావుడి చేయకూడదనుకోవడం వల్ల బిల్లు రూపొందటంలో ఎక్కువ సమయం పడుతుందని తెలిపారు.
బిల్లుపై వీలైనంత ఎక్కువ సంప్రదింపులు జరపాల్సి ఉందన్నారు. భారతదేశ సైబర్స్పేస్ సురక్షితమైనది, విశ్వసనీయమైనదని… ప్రపంచం గుర్తించేలా కొత్త చట్టం ఉండాలని అన్నారు.
భారతదేశం ప్రపంచంలో అత్యంత ఇంటర్నెట్ కనెక్టెడ్ మార్కెట్ గా ఉంది. డిజిటలైజేషన్ను ఎలా నిర్వహించాలో, ఇంటర్నెట్ ను సురక్షితంగా, విశ్వసనీయంగా నడపడం ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు నేర్పించవలసి ఉందని ఆయన చెప్పారు. కొత్త నిబంధనలు స్టార్టప్లపై మితిమీరిన భారం పడకూడదని, పరిమితులు అనువైనవిగా ఉండాలనీ చెప్పారు.
“మన ప్రజాస్వామ్యాన్ని డిజిటలైజ్ చేయడం ఎంత అవసరమో, మన ప్రజాస్వామ్యాన్ని సురక్షితంగా ఉంచడం, సాంకేతికతను విశ్వసనీయ పద్ధతిలో, జవాబుదారీ పద్ధతిలో అమలు చేయడం కూడా అంతే ముఖ్యం” అని రాజీవ్ అన్నారు.
ఫిబ్రవరి 14న IT చట్టంలోని సెక్షన్ 69(A)లో అందించిన అత్యవసర నిబంధనల ప్రకారం చైనాతో అనుసంధానించబడిన మరో 54 మొబైల్ యాప్లను నిషేధిస్తూ భారత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.