భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో మరో రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. ఉదయం 9.18 నిమిషాలకు SSLV D2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్లో… మూడు ఉపగ్రహాలు పంపారు. 156.3 కిలోల బరువున్న ఈవోఎస్-07, 8.7 కిలోల బరువున్న ఆజాదీశాట్-02 ఉపగ్రహాలు భారత్ వి కాగా… అమెరికాలోని అంటారిస్ సంస్థకు చెందిన 11.5 కిలోల బరువు గల జానూస్-01 ఉపగ్రహాన్నీ రోదసీలోకి పంపారు. ఈ ప్రయోగం విజయవంతంతో అతి తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపించిన దేశంగా ఇస్రో సరికొత్త రికార్డు సృష్టించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ఉపగ్రహం EOS 07. ఇక మార్చి లో LVM..3 రాకెట్ ప్రయోగం ద్వారా 36 ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు సిద్ధమవుతోంది ఇస్రో. మూడు ఉపగ్రహాల ప్రయోగం విజయవంతం కావడంతో షార్లో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు.
https://twitter.com/airnewsalerts/status/1623892327701024770?s=20&t=mCVkLUTqvhBfT1YYAa8zEg