భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలోని షార్ మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ-సీ 55 రాకెట్ ప్రయోగానికి అన్నీ సిద్ధంచేసింది. రేపు మధ్యాహ్నం 2 గంటల 19 నిమిషాలకు రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగికెగియనుంది. దీనిద్వారా సింగపూర్కు చెందిన 741 కిలోల టెల్ ఈవోఎస్-2 ఉపగ్రహంతోపాటు 16 కిలోల బరువున్న లూమ్లైట్ అనే చిన్న ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనుంది. ఇందుకు సంబంధించి ఇవాళ ఉదయం 11 గంటల 49 నిమిషాలకు గంటలకు కౌంట్డౌన్ ప్రారంభమైంది.
ఇక సింగపూర్ కు చెందిన టెల్ ఈవోఎస్ ను పలు ఏజెన్సీల అవసరాల కోసం వినియోగించనున్నారు. ఇక లూమ్లైట్ ఉపగ్రహం ఇనిస్టిట్యూట్ ఫర్ ఇన్ఫోకామ్ రీసెర్చ్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ శాటిలైట్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ కలిసి అభివృద్ధి చేశాయి. సింగపూర్ ఈ-నావిగేషన్ సముద్రభద్రతను పెంపొందించడం, ప్రపంచ షిప్పింగ్ కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చడమే దీని లక్ష్యం.ఆనవాయితిగా ఉపగ్రహ లాంఛింగ్ కు ముందు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ సూళ్లూరుపేటలో చెంగాలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాబోయే మూడు నెలల్లో GSLV మాక్-2, ఆదిత్య L1, చంద్రయాన్-3 ప్రయోగాలకూ సిద్ధం అవుతున్నట్టు ఆయన తెలిపారు.
The launch can be watched live on
ISRO Website
ISRO Facebookhttps://t.co/e5izHubgtq @DDNational(2/2)
— ISRO (@isro) April 20, 2023