తూర్పు జెరూసలేంలోని అల్-అక్సా మసీదులో ఇజ్రాయెల్ పోలీసులు, పాలస్తీనియన్ల మధ్య శుక్రవారం తెల్లవారుజామున ఘర్షణలు చెలరేగాయి. ప్రాంగణంలో గుమిగూడిన ప్రజలపై ఇజ్రాయెల్ దళాలు టియర్ గ్యాస్ లను, స్టన్ గ్రనేడ్ లను ప్రయోగించినట్లు సమాచారం. పాలస్తీనియన్లు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫుటేజ్ ప్రకారం, ఉదయాన్నే జనాలు ప్రార్థనల కోసం గుమిగూడుతుండగా ఇజ్రాయెల్ పోలీసులు మసీదుపై దాడి చేశారు. శుక్రవారం జరిగిన ఘటనలో పలువురు గాయపడినట్లు సమాచారం. మసీదులోకి ప్రవేశించిన బలగాలపై ప్రాంగణంలోని వ్యక్తులు రాళ్లు విసరడం వీడియోలో గమనించవచ్చు. అయితే ఇజ్రాయెల్ దళాల దాడి వెనక కారణాల గురించిన వివరాలు ఇంకా తెలియడం లేదు.
ముస్లింల పవిత్ర మాసమైన రంజాన్, అలాగే యూదుల పండుగ పస్కాకు ముందు సమ్మెలు, హింస జరుగుతుంటాయి. గతేడాదినా రంజాన్ సందర్భంగా ఇజ్రాయెల్ భద్రతా దళాలు అల్-అక్సా మసీదుపై దాడి చేశాయి. దాంతో క్రమంగా ఉద్రిక్తతలు పెరిగాయి. ఇజ్రాయెల్ పై ప్రయోగించిన హమాస్ రాకెట్లకు ప్రతీకారంగా గాజాపై 11 రోజులపాటు ప్రతిచర్యకు దిగింది ఇజ్రాయెల్.
Wallahi a deja vu!
Inside AlAqsa mosque few minutes ago #AlAqsaUnderAttack #Israel pic.twitter.com/uGsjVczpAy— Abier (@abierkhatib) April 15, 2022
తీవ్రవాద దాడులను ముందుగానే ఊహించి, రంజాన్ ముగిసే వరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నఫ్తాలి బెన్నెట్ ఇటీవల ఆ దేశ భద్రతా దళాలను ఆదేశించారు. వెస్ట్ బ్యాంక్లోని జెనిన్లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులు హతమైన నేపథ్యంలో ఈనిర్ణయం తీసుకున్నారు. ముగ్గురు ఉగ్రవాదులను ఏప్రిల్ 3 రాత్రి వెస్ట్ బ్యాంక్ నగరం జెనిన్ సమీపంలో ఇజ్రాయెల్ రక్షణ దళాలు హతమార్చాయి. భద్రతా దళాలు ఇటీవల 15పైగా తీవ్రవాద దాడులను తిప్పికొట్టాయని బెన్నెట్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ పౌరులపై తీవ్రవాద దాడుల్ని మేం సహంచబోం. రంజాన్ ను మీరు ఆనందంగా జరుపుకోవాలనే మారూ ఉంది. అదే సమయంలో మా భద్రత కూడా మాకు ముఖ్యం అని ఇజ్రాయెల్ రక్షణమంత్రి బెన్నీ గాంట్జ్ అన్నారు. కొన్ని వారాలుగా జరిగిన ఉగ్రదాడుల్లో ఇజ్రాయెల్ పౌరులు 11 మందికి పైగా చనిపోయారు. బీర్షెబా, హదేరా దాడులకు ఇస్లామిక్ స్టేట్ బాధ్యత వహించింది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)