వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇండియన్ స్పేస్ అసోసియేషన్ (ISpA) ని ద్వారా ప్రారంభించారు ప్రధాని మోదీ.
ఈ సందర్భంగా భారతఅంతరిక్ష పరిశోధన సంస్థ… ఇస్రో ప్రతినిధులతోనూ భేటీ అయ్యారు. దేశంలోని అంతిరక్ష పరిశ్రమలో వివిధ సాంకేతిక ప్రయోగాలు, ఆవిష్కరణలతో ముందుకు రానుంది భారత స్పేస్ అసోసియేషన్.
స్వయంశక్తితో సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ను నిలపనుంది. ఐఎస్పీఏ వ్యవస్థాపక కంపెనీల్లో దాదాపు దేశీ కంపెనీలే ఉన్నాయి. ఎల్అండ్టి, నెల్కో, వన్వెబ్, భారతీ ఎయిర్టెల్, మ్యాప్ మై ఇండియా, వాల్ చంద్నగర్ ఇండస్ట్రీస్, అనంత్ టెక్నాలజీ లిమిటెడ్ వంటి ప్రధాన కంపెనీలతో పాటు….గోద్రెజ్, హ్యూస్ ఇండియా, అజిస్టా-బీఎస్టి ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్, బిఈఎల్, సెంటమ్ ఎలక్ట్రానిక్స్, మాక్సర్ ఇండియా వంటివీ ఉన్నాయి.
అంతరిక్షరంగంలో గత కొన్నేళ్లుగా ఇండియా వినూత్న ప్రయోగాలు చేపట్టింది. కోవిడ్ 19 ప్రభావంతో 2020లో నిర్వహించాల్సిన అనేక ప్రయోగాలు వాయిదాపడ్డాయి. తొలి సోలార్ మిషన్ ప్రయోగాన్ని 2022 చివర్లో చేపట్టేందుకు సిద్ధమవుతోంది. దేశపు రెండవ స్పేస్ అబ్జర్వేటరీ ఎక్స్పోశాట్ను వచ్చే ఏడాది ఇస్రో ప్రయోగించనుంది. అసలైతే 2020-21లో కనీసం 20 ప్రయోగాలు చేపట్టాలని నిర్ణయించింది. అందులో ముఖ్యమైనది మానవరహిత గగన్ యాన్ మిషన్. 2022లో లేదా 2023లో దాన్ని చేపట్టే అవకాశాలున్నాయి.