హిజాబ్ కేసులో తీర్పునిచ్చిన కర్నాటక న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకున్నారు ఇస్లామిస్టులు. హత్య చేస్తామంటూ వారికి బెదిరింపులు వస్తున్నాయి. ఇందు మక్కల్ కట్చి షేర్ చేసిన ఓ వీడియో కలకలం రేపుతోంది. హిజాబ్ కేసు తీర్పునిచ్చిన న్యాయమూర్తులు హత్యకు గురైతే అందుకు బాధ్యులు వారే అవుతారంటూ TMTJ నాయకుడు కోవై ఆర్. రహమతుల్లా ప్రకటించారు.
https://twitter.com/Indumakalktchi/status/1504707264191483904?s=20&t=zJL2jtOKs1FWXO2kJXOBfA
హిజాబ్ వివాదం నేపథ్యంలో ఆ కేసులో కర్నాటక కోర్టు తీర్పునిచ్చింది. కళాశాలకు వెళ్లే విద్యార్థులకు హిజాబ్ తప్పనిసరి కాదంది. అయితే తీర్పునిచ్చిన జడ్జిలను పలువురు ఇస్లామిస్టులు లక్ష్యంగా చేసుకున్నారు. న్యాయమూర్తులను చంపేస్తామంటూ తమిళనాడు మధురై వేదికగా ప్రకటించింది తౌహీద్ జమాత్ (TMTJ) అనే ఇస్లామిస్ట్ సంస్థ. వారు హత్యకు గురైతే అందుకు బాధ్యులు వారు మాత్రమే అవుతారని సంస్థ నాయకుడు రహమతుల్లా అన్న మాటలు కలకలం రేపుతున్నాయి.
కర్నాటకలోని అధికార పార్టీకి న్యాయవ్యవస్థ అమ్ముడుపోయిందనీ, వారి తీర్పే చెల్లదని ఆయన అన్నారు. అమిత్ షా సూచన మేరకే కోర్టు ఆ తీర్పునిచ్చిందని ఆరోపించారు. పక్షపాతంతో తీర్పునిచ్చినందుకు న్యాయమూర్తులు సిగ్గుపడాలనీ వ్యాఖ్యానించారు రహమతుల్లా. న్యాయమూర్తుల వ్యక్తిగత విశ్వాసాలపై కాకుండా రాజ్యాంగం ఆధారంగా కోర్టు తీర్పులు రావాలనీ అన్నారు. వివాదాస్పద వీడియో సుదీర్ఘ సంస్కరణను ‘ఆన్ లైన్ దావా 24X7 అనే చానెల్ యూట్యూబ్ చానల్లో వివాదాస్పద వీడియోను పోస్ట్ చేశారు. దాదాపు 17 నిమిషాల 40 సెకన్ల వీడియో రహమతుల్లా వ్యాఖ్యలు స్పష్టంగా ఉన్నాయి.
భారత్ లో సాధువులు నగ్నంగా తిరుగుతుంటే… ముస్లిం బాలికల్ని హిజాబ్ ధరించకుండా అడ్డుకుంటున్నారనీ అన్నారు. తాము మోదీ, యోగీ, అమిత్ షాలకు భయపడం. మేం అల్లాకు మాత్రమే భయపడతాం. మా సహనాన్ని పరీక్షించవద్దని, మేం సహనం కోల్పోతే మీరు మిగలరని హెచ్చిరించారు.
https://twitter.com/HLKodo/status/1504512368214102025?s=20&t=GdNWc4mTSsTdgeYFHmkXDg
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)