జమ్మూ కాశ్మీర్ స్టేట్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ 12వ తరగతి పరీక్షలల్లో టాపర్ గా నిలిచిన కాశ్మీరీ విద్యార్థి అరూసా పర్వేజ్ కు హిజాబ్ ధరించలేదని బెదిరింపులు వస్తున్నాయి. ఫలితాలు 8 ఫిబ్రవరి విడుదలయ్యాయి. 99.8 శాతం మార్కులతో అగ్రస్థానంలో నిలిచింది.
మీడియాలో ఆమె ఫొటోలు, వీడియోలు చూసిన ఇస్లాం చాందసవాదులు పర్వేజ్ ను లక్ష్యంగా చేసుకున్నారు. హిజాబ్ ధరించలేదని దుర్భాషలాడటం మొదలుపెట్టారు.వారిలో కొందరు ఆమెపై అత్యాచారం చేసి చంపేస్తామని బెదిరించడం దారుణం. ఆమెకు ఇస్లాం పాఠాలు బోధిస్తూ… కర్నాటకలోని తోటి విద్యార్థినిని చూసి నేర్చుకోవాలంటూ చెప్పుకొచ్చారు.
అయితే బెదిరింపులు తననేం భయపెట్టలేవని..కానీ తన తల్లిదండ్రులు మనోవేదన చెందుతున్నారని పర్వేజ్ అంటోంది. హిజాబ్ ధరించటం, ధరించకపోవటం అనేది మతం పట్ల ఒకరి నమ్మకాల్ని నిర్దేశించలేదని, బహుశా వారి కంటే నేను అల్లాను ఎక్కువగా ప్రేమిస్తాను, సహృదయంతో నేను ముస్లింనని గట్టిబదులే ఇచ్చారామె.