ఉదయపూర్లో తల నరికిన తరహాలోనే మహారాష్ట్రలో 54 ఏళ్ల వ్యక్తిని పదునైన ఆయుధంతో గొంతు కోసి హత్య చేశారు. మెడికల్ ఎక్విప్మెంట్ దుకాణం నడుపుతున్న బాధితుడు ఉమేష్ కోల్హే జూన్ 21న రాత్రి తన స్కూటర్పై ఇంటికి తిరిగి వస్తుండగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దుండగులు అతడిపై దాడి చేశారు. దాడి జరిగినప్పుడు అతని కుమారుడు సంకేత్, అతని భార్య కూడా మరొక బైక్పై ఉన్నారు. మెడపై కత్తిపోటుకు గురైన కోహ్లేను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
స్థానిక మీడియా కథనం ప్రకారం, ఉమేష్ పొరపాటున తన సన్నిహిత మిత్రులు, అలాగే వాట్సాప్ గ్రూపులలో మెసేజ్ ఫార్వార్డ్ చేశాడు. గ్రూప్ లో కొంతమంది ముస్లిం సభ్యులు కూడా ఉన్నారు.
ముదాసిర్, షారుక్, అబ్దుల్, షోయాబ్, అతిబ్లను సిటీ కొత్వాలి పోలీసులు అరెస్టు చేశారు. ఉమేష్ పంపిన పోస్ట్ మహ్మద్ ప్రవక్తను అవమానించేలా ఉందని.. కాబట్టి అతను చనిపోవాలి అని కిల్లర్ చెప్పినట్లు తెలిసింది. ఈ సంఘటన జరిగిన ఒక వారం తర్వాత, ఉదయ్పూర్ ఘోరం జరిగింది. అక్కడ రాడికల్స్ కన్హయ్య లాల్ తల నరికి చంపారు, ఎందుకంటే అతని కుమారుడు సోషల్ మీడియాలో నూపూర్ శర్మకు మద్దతు ఇచ్చాడు.
https://twitter.com/ABPNews/status/1543143534944854017?s=20&t=FIKJ2Sij5MtH3U2g27h2NA
అమరావతిలో మెడికల్ స్టోర్ యజమాని ఉమేష్ కోల్హే దారుణ హత్యకు గురైన పది రోజుల తర్వాత జాతీయ దర్యాప్తు బృందం కేసు దర్యాప్తు చేపట్టింది. స్థానిక పోలీసులు ఇప్పటికే చాలా మంది నిందితులను అరెస్టు చేసి, ఇది దోపిడీ కేసు అని చెప్పినప్పటికీ, చాలా మంది దీనిని నమ్మట్లేదు, బీజేపీ మాజీ ప్రతినిధి నూపుర్ శర్మకు మద్దతు ఇచ్చినందుకు అతన్ని హత్య చేసినట్లు స్థానికులు అంటున్నారు.
హత్య కేసులో సాధ్యమయ్యే అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేయాలనే డిమాండ్ పెరగడంతో, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు కేసును NIAకి అప్పగించింది. పరిణామాన్ని ధృవీకరిస్తూ MHA కేసు దర్యాప్తును NIAకి అప్పగించినట్లు కేంద్ర హోంమంత్రి కార్యాలయం తెలిపింది.
“హత్య వెనుక కుట్ర, సంస్థల ప్రమేయం, అంతర్జాతీయ సంబంధాలపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయనున్నారు” అని HMO ఒక ట్వీట్లో తెలియజేసింది. కేసు దర్యాప్తు కోసం NIA బృందం ఇప్పటికే అమరావతికి చేరుకుంది. విచారణ కొనసాగుతోంది.