జర్నలిస్ట్ రుబియా లియాఖత్ మరోసారి ఇస్లామిక్ వాదులు టార్గెట్ చేశారు. న్యూస్ స్టూడియోలోకి వెళ్తూ నేలను తాకి నమస్కరించడమే ఆమె ఈ సారి చేసిన పాపం… గ్రేట్ ఫీలింగ్… ఈ అనుభూతిని అందించినందుకు లవ్ యూ టీమ్… అంటూ తను న్యూస్ స్టూడియోలోకి వెళ్తూ ఉన్నప్పటి వీడియోను షేర్ చేసినందుకు ఇస్లామిస్టుల ఆగ్రహానికి గురైందామె. అందులో ఆమె ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి ఉంది. ఆ వీడియోను ట్విట్టర్లో షేర్ చేయడం వారికి ఆగ్రహం తెప్పించింది. స్టూడియోలోకి వెళ్తూ గౌరవంగా నమస్కారం చేస్తూ…భారతీయ సంస్కృతిని అనుసరించడం వారికి నచ్చలేదు.
ఎవరైనా సరే పనిచేసే ప్రాంతాన్ని దేవాలయంగా, వృత్తిని దైవంగా భావిస్తారు. అందుకు కృతజ్ఞతగా ఉండడం మన సంస్కృతి. లక్షలాదిమంది భారతీయుల్లాగే లియాఖత్ కూడా స్టూడియోలో అడుగుపెడుతూ నేలను తాకి నమస్కరించింది. అయితే అది ఇస్లాంకు విరుద్ధమంటూ మత చాందసవాసులు ఆమెపై మూకుమ్మడిదాడికి దిగారు.
రుబికా ట్వీట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉమర్ ఖాన్ అనే వ్యక్తి నేలను తాకడం ముస్లిం సంస్కృతికి విరుద్ధమంటే…అలాచేయడం షిర్క్ అని…అంటే ఇస్లాం ప్రకారం విగ్రహారాధన, బహుదేవతారాధన విరుద్ధమని మరికొందరు ట్వీట్ చేశారు. ఇలా వంగి నేలకు నమస్కరించడం అంటే మూఢత్వమని ఒకరంటే…
ఆమెకు డబ్బు తప్ప ఇస్లాం విశ్వాసాలేం పట్టవని మరొకరు ఆమెపై దాడికి దిగారు.
రుబియా లియాఖత్ పై ఇస్లామిస్టులు ఆన్ లైన్ దాడి చేయడం ఇదేమొదటిసారి కాదు. గతేడాది కూడా పసుపురంగు దుస్తులు ధరించి ఈద్ శుభాకాంక్షలు చెప్పినందుకు ఇస్లాంవాదులు ఆమెను విమర్శించారు. ఇక 2019లో ఇస్లాం మతాచారాలకు విరుద్ధంగా మేకప్ వేసుకుందంటూ ఆమెను లక్ష్యంగా దాడులు చేశారు.