శ్రీరామనవమి సందర్భంగా గత వారం దేశంలోని పలు ప్రాంతాల్లో అల్లర్లకు, మత పరమైన ఉద్రిక్తతలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా PFI ని మోదీ ప్రభుత్వం త్వరలో నిషేధించనుంది. వచ్చే వారంలో ఈ నిర్ణయం వచ్చే అవకాశం ఉందని మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
PFI ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో చట్టవిరుద్ధంగా ఉంటోంది. అయితే ఓ కేంద్రీకృత నోటిఫికేషన్ ద్వారా పూర్తిగా నిషేధించాలని కేంద్రం యోచిస్తోంది. 2006లో ఏర్పాటైన ఈ సంస్థ వివిధ రకాల సామాజిక, దేశ వ్యతిరేక చర్యలలో పాల్గొంటూ వస్తోంది. ఈ మేరకు నిఘావర్గాల దగ్గర ఆధారాలతో సమాచారం ఉంది. అసలైతే సంస్థను బ్లాక్ లిస్ట్ లో చేర్చడానికి హోంమంత్రిత్వ శాఖ దగ్గర ఇప్పటికే రుజువులున్నాయి. PFIని నిషేధించే ప్రక్రియమొదలైందని.. కేంద్రం ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఏప్రిల్ 2021లోనే సుప్రీంకోర్టుకు తెలిపారు.
Government in process to impose a #PFIBan soon, tune in for more details on the #BREAKING story here – https://t.co/ESTVAev0zX pic.twitter.com/17iBtpl7N0
— Republic (@republic) April 15, 2022
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రెండూ PFIని నిషేధించాలని సిఫారసు చేస్తూ వారి ఇంటెలిజెన్స్ పరిశోధనలను రూపొందించాయి. NIA నివేదిక ప్రకారం, యునైటెడ్ స్టేట్స్లో 9/11 ఉగ్రదాడుల తర్వాత 2001లో నిషేధానికి గురైన స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియా సిమి అనుబంధ సంస్థనే PFI. ఈ రెండు సంస్థల బోర్డుల్లో ఒకే వ్యక్తులు పనిచేశారనే వాస్తవాన్ని, CAA వ్యతిరేక నిరసనలకు నిధులు సమకూర్చడంలో ఇదే బృందం కీలకంగా పని చేసిందని NIA తెలిపింది.
2020లో ఆర్ఎస్ఎస్ కార్యకర్త వరుణ్ భూపాలంపై హత్యాయత్నానికి సంబంధించి పిఎఫ్ఐ, అలాగే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI)కి చెందిన ఆరుగురు సభ్యులను అరెస్టు చేశారు. ప్రఖ్యాత జాతీయవాద సిద్ధాంతకర్త చక్రవర్తి సూలిబెలే, బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్యను కూడా హత్య చేయాలని ప్లాన్ చేశారు. 2020లో జరిగిన హిందూ వ్యతిరేక ఢిల్లీ అల్లర్లలో PFI ప్రత్యక్ష పాత్రను సూచించే అనేక సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఏప్రిల్ 14న గోవా, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ సహా పశ్చిమ బెంగాల్లో శ్రీరామనవమి ఊరేగింపుల సందర్భంగా హింస చెలరేగినప్పుడు, అలాగే ఖార్గోన్లో అల్లర్లు, రాళ్లదాడికి PFI కారణమని BJP MP VD శర్మ పేర్కొన్నారు.
NIA ఒక సమగ్ర నివేదికను సమర్పించిన నేపథ్యంలో ఉగ్రఉదంతాలతో ఈ ఇస్లామిక్ గ్రూప్ సంబంధాల్ని మరోసారి పరిశీలంచింది హోంమంత్రిత్వ శాఖ