ఇస్లామిక్ స్టేట్ (ISIS), జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ (JMB) ఉగ్రవాది మహమ్మద్ మొసియుద్దీన్ అలియాస్ అబూ మూసాను జూన్ 3న దోషిగా నిర్ధారించింది NIA ప్రత్యేక న్యాయస్థానం… 2014లో పశ్చిమబెంగాల్ లోని బుర్ద్వాన్ జిల్లాలో ఖగ్రాఘర్లో జరిగిన బాంబు పేలుళ్లలో అతనికి కఠిన జీవిత ఖైదు విధించింది.
2017లో అతడ్ని అరెస్టు చేసినట్లు వార్తా సంస్థలు నివేదించాయి. 2014 ఖగ్రాఘర్ బాంబు పేలుడు కేసుకు సంబంధించి బిస్వ భారతి ప్యాసింజర్ రైలు నుంచి జూలై 2016లో అతన్ని అరెస్టు చేసినట్లు సమాచారం.. ఇస్లామిక్ స్టేట్, జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నందుకుగానూ అతడిని అరెస్టు చేశారు.
2014 బుర్ద్వాన్ బాంబు పేలుడు కేసును విచారిస్తున్న NIA, మూసా ఇస్లామిక్ స్టేట్స్ కోసం దాడులకు ప్లాన్ చేస్తున్నాడని.. యువతను తీవ్రవాద సంస్థలో చేర్చడానికి కూడా ప్రయత్నిస్తున్నాడని ఆరోపించింది. విచారణలో మూసా.. ఇ-మెయిల్లు, సోషల్ నెట్వర్కింగ్ సైట్లు, మొబైల్ కాల్ల ద్వారా ISIS అగ్రనేతలు, JMBతో సంబంధాలు కలిగి ఉన్నాడని ఆరోపించింది.
CID, NIA సహా IB జాయింట్ ఇంటరాగేషన్ లో, ఖగ్రాఘర్ జంట పేలుళ్ల కేసుకు సంబంధించి 2014లో అరెస్టయిన JMB కీలక సభ్యుడు అమ్జద్ షేక్తో తన సంబంధాన్ని మూసా అంగీకరించినట్లు.. అతను ఒక మాజీ ముజాహిదీన్ కార్యకర్త అయిన షఫీ అర్మార్తో కూడా సంప్రదింపులు జరిపినట్లు నివేదించారు. అబూ మూసా జమాత్-ఉల్-ముజాహిదీన్ మాజీ సభ్యుడు, ఢాకా దాడికి ప్రధాన సూత్రధారి అయిన అబూ సులైమాన్ను కూడా కలిశాడు.
మిషనరీస్ ప్రధాన కార్యాలయమైన మదర్ హౌస్పై కూడా దాడి చేయాలని మూసా ప్లాన్ చేసినట్లు 2016 డిసెంబర్ 23న కోల్కతాలోని బ్యాంక్షాల్ కోర్టులో NIA దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో పేర్కొంది. మూసా ఒక హిందూ వ్యక్తి తల నరికివేయాలని, ఆ వ్యక్తి సహచరుడిని అత్యాచారం చేయాలని, రెండు దాడులను చిత్రీకరించి.. బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న అతని హ్యాండ్లర్కు వీడియోలను ఇమెయిల్ చేయాలని కూడా అతడికి ఆదేశాలు వచ్చాయి. అబూ సులైమాన్ తెలిపిన వివరాల ప్రకారం మూసాకు ముస్లిమేతర లక్ష్యాలను ఎంచుకోమని అతనికి సలహా ఇచ్చారు.
ఈ వీడియోను సిరియాలోని ఐఎస్ఐఎస్కు పంపించి, ఉగ్రవాద గ్రూపు కమ్యూనికేషన్స్ విభాగం ఇంటర్నెట్లో విడుదల చేయాల్సింది, ఆ తర్వాత ISIS భారతదేశంలో ‘కాలిఫేట్’ స్థాపన గురించి బహిరంగ ప్రకటన చేయాలని ప్రణాళిక వేసింది. అయితే ప్రణాళికను అమలు చేయడానికి ముందే ఇంటెలిజెన్స్ బ్యూరో, NIA అందించిన ఇన్పుట్ల ఆధారంగా జూలై 6న బెంగాల్ పోలీసులు బుర్ద్వాన్ రైల్వే స్టేషన్ నుంచి మూసాను అరెస్టు చేశారు.
అబూ మూసా 2020 ఫిబ్రవరిలో కోల్కతాలోని సిటీ సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేశాడు. 2014 బుర్ద్వాన్ పేలుడు కేసుకు సంబంధించి న్యాయమూర్తి విచారణ సందర్భంగా మూసా బూట్లను విసిరాడు. షూ గురి తప్పి కోర్టులో ఉన్న లాయర్కు తగిలింది.
అతను 2020 జనవరిలో ప్రెసిడెన్సీ జైలులో వార్డెన్పై దాడి చేశాడు. 2017 డిసెంబర్లో అలీపూర్ జైలులో జైలు గార్డు గొంతును ఇనుప మేకుతో కోసి.. ఆపై జిహాదీ నినాదాలు చేశాడు. 2014 బుర్ద్వాన్ పేలుళ్ల కేసులో అబూ మూసా ఎన్ఐఏ కస్టడీ కింద ప్రెసిడెన్సీ జైలులో ఉన్నాడు.
2014 బుర్ద్వాన్ పేలుడు కేసు :
పశ్చిమ బెంగాల్లో బుర్ద్వాన్ జిల్లాలోని సందడిగా ఉండే ఖగ్రాఘర్ పరిసరాల్లో 2014 అక్టోబరు 2న శక్తివంతమైన బాంబు పేలింది. JMB సభ్యులు ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ (IED)ని తయారు చేస్తుండగా.. అది ఫాబ్రికేషన్ ప్రక్రియలో అనుకోకుండా పేలింది. తీవ్ర గాయాలపాలైన ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. పశ్చిమ బెంగాల్ పోలీసులు మొదట కేసు నమోదు చేశారు, తరువాత అక్టోబర్ 10న NIA ఈ కేసును స్వాధీనం చేసుకుంది.
భారతదేశం, బంగ్లాదేశ్లలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తీవ్రవాద చర్యలను నిర్వహించడానికి.. యుద్ధం చేయడానికి భారతదేశంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలలో తమ సభ్యులను రిక్రూట్ చేయడానికి, శిక్షణ ఇవ్వడానికి JMB పన్నాగాన్ని NIA దర్యాప్తు వెల్లడించింది. ఐఈడీలు, పేలుడు పదార్థాలు, హ్యాండ్ గ్రెనేడ్లను భారీ సంఖ్యలో స్వాధీనం చేసుకున్నారు. ఎన్ఐఏ విచారణలో మొత్తం 33 మందిపై వివిధ నేరాలకు పాల్పడ్డారు. 33 మంది నిందితుల్లో 31 మందిని అరెస్టు చేశారు. కోల్కతాలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ఇప్పటికే 30 మంది నిందితులను దోషులుగా నిర్ధారించి వారికి వివిధ షరతులు విధించింది.
గతేడాది బంగ్లాదేశ్కు చెందిన ఉగ్రవాద సంస్థ జమాత్ ఉల్ ముజాహిదీన్ (జేఎంబీ)కి చెందిన భారత అధినేత కౌసర్ అలీ అలియాస్ మహ్మద్ జాహిద్ ఉల్ ఇస్లాం అలియాస్ బాంబర్ మియాన్కు ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు 2014 బుర్ద్వాన్ పేలుడు కేసులో అతని ప్రమేయం ఉన్నందున 29 ఏళ్ల జైలు శిక్ష, రూ.35,000 జరిమానా విధించింది. ఇండియన్ పీనల్ కోడ్, చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం, ఆయుధాల చట్టం, ఫారెనర్స్ యాక్ట్ లోని సెక్షన్లను ఉల్లంఘించినందుకు కౌసర్ను కోర్టు దోషిగా నిర్ధారించింది.
ఉగ్రవాది కౌసర్కు 2013 బోధ్గయా పేలుళ్లతో సంబంధాలున్నాయని ఎన్ఐఏ తన ఛార్జ్ షీట్లో పేర్కొంది. కౌసర్ అలియాస్ బాంబర్ మియాన్ను అరెస్టు చేసిన తర్వాత బంగ్లాదేశ్లో విచారిస్తున్నప్పుడు, రోహింగ్యా ఉగ్రవాద సంస్థ రోహింగ్యా సాలిడారిటీ ఆర్గనైజేషన్ (RSO)తో JMBకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని .. JMB కార్యకర్తలు RSO నుంచి తుపాకీలలో శిక్షణ పొందారని వెల్లడించడం ఇక్కడ గమనార్హం.