
screenshot from video
కర్నాటకలో ప్రారంభమైన హిజాబ్ దుమారం వెనక పాకిస్తాన్ ఐఎస్ఐ హస్తం ఉన్నట్టు నిఘావర్గాల సమాచారం. నిషేధిత సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ SJF సహకారంతో ఈ వివాదాన్ని మరింత రాజేసేందుకు ఐఎస్ఐ ప్రయత్నిస్తోందని సమాచారం. ఈ మేరకు జాతీయమీడియాలో కథనాలు వచ్చాయి. వాటిని బట్టి హిజాబ్ వివాదాన్ని ఐఎస్ఐ ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తోంది. దర్యాప్తు సంస్థలు, పోలీసులు దీనిపై దృష్టి సారించాలని ఇంటెలిజెన్స్ బ్యూరో తెలిపింది. భారత దేశ వ్యతిరేక శక్తులు SFJ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నుతో చేతులు కలిపి, దేశంనుంచి ‘ఉర్దూయిస్థాన్’ చీలిక కోసం ఉద్యమాన్ని నడిపే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలతో ఉర్దూయిస్థాన్ డిమాండ్ తెరపైకి రావచ్చట. భారతీయ ముస్లింలకు మద్దతంటూ పన్ను రిలీజ్ చేసిన వీడియోలో ముస్లింలు రెచ్చగొడుతున్నట్టే ఉంది. ఉర్దూయిస్తాన్ కోసం నిధులిచ్చేందుకు సిద్ధమని భారతీయ ముస్లింలకు భరోసా ఇచ్చాడు. హిజాబ్ రిఫరెండం కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్లాట్పాం స్క్రీన్షాట్స్, ఇమేజెస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.