ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయ నిర్మాణం కోసం భూరి విరాళం ఇచ్చింది ఓ ముస్లిం కుటుంబం. బిహార్ చంపారన్ జిల్లా కైత్వాలియాలో అతిపెద్ద విరాట్ రామాయణ మందిర్ నిర్మాణం జరుగుతోంది. అందుకోసం రెండున్నరకోట్ల విలువైన భూమిని ఆలయానికి విరాళంగా ఇచ్చారు ఇష్తయాక్ అహ్మద్ ఖాన్ . ఈమేరకు మందిర నిర్మాణం చేస్తున్న మహవీర్ మందిర్ ట్రస్ట్ కు భూమి బదలాయిస్తూ రిజిస్ట్రేషన్ చేశారు. ఇష్తియాక్ గువాహటిలో వ్యాపారం చేస్తుంటారు. సొంతగ్రామమైన కైత్వాలియాలో వీరి కుటుంబానికి వందల ఎకరాల భూములున్నాయి.
ప్రపంచంలోనే పెద్దదైన ఆలయంగా మనం కాంబోడియాలోని ఆంకోర్ వాట్ ఆలయం అని చదువుకుంటున్నాం. అయితే దానికన్నా పెద్దగా విరాట్ రామాయణ మందిరాన్ని నిర్మించనున్నారు. ఆంకోర్ వాట్ కంటే ఎత్తుగా 215 అడుగుల ఎత్తులో నిర్మాణం సాగనుంది. ఎత్తైన గోపురాలతో 18 ఆలయాలుంటాయి. ఇందులో అతిపెద్ద శివలింగాన్నీ స్థాపించనున్నారు. ఆలయ నిర్మాణ అంచనా వ్యయం 5 వందల కోట్లు.
పౌరాణిక ప్రాశస్త్యం ఉన్న ప్రాంతం కైత్వాలియా. శ్రీరాముడు జనకపురి నుంచి అయోధ్యకు తిరిగివస్తూ.. రాత్రిపూట ఇక్కడ బసచేశాడని చెబుతారు. దేవకీ నదిని ఆనుకుని ఆలయ నిర్మాణం జరుగుతోంది. మొత్తం 125 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ ఆలయ నిర్మాణం బాధ్యతను పట్నాకు చెందిన మహవీర్ మందిర్ ట్రస్ట్ చూస్తోంది. ఆలయం ఎత్తు 270 అడుగులు, 1080 అడుగుల పొడవు, 540 అడుగుల వెడల్పుగా చెబుతున్నారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)