స్వాతంత్ర పూర్వం దేశచరిత్ర లో మొట్టమొదటిసారి ఎన్నికల రాజకీయాలు ఎట్లా ప్రారంభమైనాయి? అవి స్వతంత్ర భారత దేశంలో, స్వపరిపాలనలో 75 సంవత్సరాల నుండి ఎట్లా సాగుతున్నయి? ఎటువంటి పోకడలతో దేశాన్ని ఎటు తీసుకొని వెళుతున్నయి? ,ఓట్లు ,వోటుబ్యాంక్ రాజకీయాలు దేశసమస్యలను ఎట్లా విశ్లేషి స్తున్నాయి? ,ప్రాంతీయ ధోరణలు ఎట్లావున్నాయి? , దేశంలో రాజకీయ స్థిరత్వానికి అవి ఎట్లా సవాళ్లు విసురుతున్నాయి? స్థూలంగా ఒకసారి దేశంలో సమీక్షా జరగవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ఆ దిశలో ఒక చిన్న ప్రయత్నం …….
పార్లమెంటరీ ప్రజాస్వామ్య పాలన భారత్ లోఎట్లా మొదలైనది?
1857 సంవత్సరం స్వాతంత్ర పోరాటం తరువాత భారత్ పాలన ఈస్టిండియా కంపెనీ చేతుల లోనుండి 1858 లో బ్రిటిష్ పార్లమెంట్ చేతులలోకి వెళ్ళిపోయింది. .యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంటు లో భారత ప్రభుత్వ చట్టం1858 ఆగస్టు 2 న (21 & 22 విక్. సి. 106) ఆమోదించబడింది, అప్పటి నుండి బ్రటిష్ పార్లమెంట్ భారత్ ను పాలించటం ప్రారంభించింది. ఆ క్రమంలో బ్రటిష్ పార్లమెంట్ 34 సంవత్సరాలు తరువాత అంటే 1892 సంవత్సరం భారత్ లో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది, దాని లో భాగం గా నే 1892 లో ఇండియన్ కౌన్సిల్ ఆక్ట్ రూపొందించింది , 1920లో బ్రిటీష్ ఇండియాలో ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మరియు ప్రావిన్సు కౌన్సిల్ కు సభ్యులను ఎన్నుకోవడానికి దేశ ఆధునిక చరిత్రలో తొలి సాధారణ ఎన్నికలు జరిగాయి.దానితో అప్పుడు ఉన్నప్రాంతాల లో రాజకీయ పార్టీ లు ప్రారంభమైనాయి 1906 లోనే ముస్లిం లీగ్ ప్రారంభమైంది .1934లో బ్రిటిష్ ఇండియాలో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కి సాధారణ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది 1935 బ్రిటీష్ భారత ప్రభుత్వ చట్టం ప్రకారం 1936-37 శీతాకాలంలో బ్రిటిష్ ఇండియాలో ప్రాంతీయ ఎన్నికలు జరిగాయి, ఎన్నికల ద్వారా కాంగ్రెస్ తన ప్రజా ఉద్యమానికి వేదిక అయిన కాంగ్రెస్ సంస్థను రాజకీయ సంస్థగా అవతారం ఎత్తటం ప్రారంభమైంది, ఆ ఎన్నికలలో కాంగ్రెస్ 1500 స్థానాలకు గాను దాదాపు 758 స్థానాలను గెలుచుకుని అద్భుతమైన విజయం సాధించి ఏడు ప్రాంతీయ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. ఆ ఎన్నికలలో 1906 ప్రారంభమైన ముస్లిం లీగ్ కూడా పాల్గొన్నది. అప్పటినుండి దేశ చరిత్రలో ఓటు ద్వారా ఎన్నికలు, ఎన్నుకోవటం మొదలైంది.1906 నుండి ముస్లింలీగ్ 1947 వరకు దేశంలో నిర్మాణం చేసిన సంఘర్షణ చివరకు 1947 ఆగస్టు 14 న దేశవిభజన పాకిస్తాన్ ఏర్పాటు జరిగిపోయింది. 1947 ఆగస్టు 15 న బ్రటిష్ వాళ్ళు భారత్ కు అధికార బదిలీ చేసి స్వాతంత్రం ఇచ్చారు.
భారత్ లో ఒకప్పటి గణ రాజ్యం అంటే ప్రజాపాలనే- నేటి గణతంత్ర రాజ్యం ఎట్లా ఉన్నది ? భారత దేశంలో ఉన్న సామజిక వ్యవస్థ ఒక సహజమైన నాయకత్వాన్ని ఎప్పుడు అందిస్తూ నే ఉంటుంది, అటువంటి పరంపర మన గణరాజ్యాలలో స్పష్టంగా కనబడేది మహాభారతకాలం లోనే దేశంలో శక్తివంతమైన గణరాజ్యాలు ఉండేవి దానిలో ద్వారకా చాలాప్రసిద్ధం. భారతదేశంలో వేల సంవత్సరాలుగా ఉన్న గణ రాజ్యవ్యవస్థ, రాజులు పాలించిన రాజ్య వ్యవస్థ కాదు, ప్రజల చేత ప్రజల అభిప్రాయం ప్రతి బింబించే పాలనా వ్యవస్థ అది, ఇప్పటి లాగా ఓటు అనేది అనివార్యమైనప్పుడే వోటింగ్ జరిగేదే. ఒకప్పుడు దేశ సరిహద్దులను కాపాడినవి గణ రాజ్యాలే. కానీ ఇప్పటి ప్రజాస్వామ్య పాలనలో చోటుచేసుకొంటున్నపరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయి, అందులో ప్రాంతీయ పార్టీ ల ధోరణలుప్రత్యేకంగా ఉన్నాయి అవి పాలనను వెనకటి సంస్థానాల వారసత్వ పాలనలోకి తీసుకొని వెళుతున్నాయి, దానికోసం తామే సర్వస్వము గా వ్యవహరిస్తూ నియంతృత్వ ధోరణలతో దేశానికిసంకట పరిస్థితులు నిర్మాణం చేసాయి, చేస్తున్నాయి. ఉదాహరణకు తమిళనాడు రాష్ట్ర చరిత్ర చూస్తే అర్ధమౌతుంది, ఉదాహరణకు దేశానికీ అనుసంధాన భాషగా హిందీని ప్రతిపాదిస్తే దానిని వ్యతిరేకిస్తూ చేసిన ఆందోళన, దాని కారణంగా రాజ్యాగం గుర్తించని ఆంగ్లభాష ఇంకా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నది, అది ఇక్కడ మాత్రమే సాద్యమైనది, ప్రాంతీయ తత్వాలకు ప్రాణంపోసింది దానిపరాకాష్ట ఇది ఒకదేశం కాదు ఒకఉపఖండ ,ఇది ఒక జాతికాదు జాతులసమూహారం అని మాట్లాడేవాళ్ళు ఈ రోజున కుడా శక్తి వంతం గ తమ వాదనను వినిపిస్తున్నరు, వాళ్లే గడచినా కొన్ని దశాబ్దాలుగా హిందూ అంటే మతతత్వం గా ప్రచారం చేస్తూ హిందూ ,హిందీ హిందుత్వం అని మాట్లాడుతూ హిందుత్వం దేశాన్ని మతతత్వ దేశంగా నిర్మాణం చేయటానికి ప్రయత్నిస్తున్నది అని ప్రచారం చేస్తూన్నారు. స్వతంత్ర పోరాటం సమయం లో కాంగ్రెస్ కూడా హిందుత్వాన్నిమతతత్వం గ మాట్లాడుతూ హిందూ సంస్థలను హిందుత్వాన్ని విమర్శిస్తూ మహ్మదాలిజిన్న చేసిన ద్విజాతి సిద్ధాంతాన్ని ఒకరకంగా సమర్ధిస్తూ తాము ముస్లింల రక్షకులుగా అవతరమెత్తారు. ఈ రోజున కూడా కాంగ్రెస్ మారలేదు పైగా ప్రాంతీయ పార్టీ లు అదే విధానాన్ని అనుసరిస్తూ సమాజంలో విభజన తీసుకోని వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి , ఈ పోకడలాన్ని అన్ని ప్రాంతీయ పార్టీ లు బలంగా ఉన్నచోట ఎక్కువగా సాగుతున్నాయి, ఇది ఈ జాతి సమైక్యతకు ,దేశసార్వభౌమత్వానికి సవాళ్లు విసురుతున్నది. అంతేకాదు వ్యక్తిపూజలు పరాకాష్టకు చేరుకొన్నయి.
ప్రజాస్వామ్య పోకడలను పరిణామాలను హెచ్చరించిన స్వామినాధన్
ప్రజాస్వామ్య పాలన ఎన్నికల పరిణామాలు ఈ దేశాన్ని ఎటు తీసుకొని వెళ్ళుతున్నాయి ఆరోజులలోనే అరవింద మహర్షి లాంటి పెద్దలుహెచ్చరిస్తూ వచ్చారు . దేశం లో ఇప్పుడు ఉన్న పరిస్థితులను ఆ రోజులలోనే మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాల ప్రొఫెసర్ కె. స్వామినాథన్వ్యాఖ్యానించారు ఆ వివరాలు గమనిద్దాము. . 1938 లో ప్రొఫెసర్ కె. స్వామినాథన్ అన్నామలై విశ్వవిద్యాలయంలో విద్యార్థుల నుద్దేశించి చేసిన ప్రసంగం లో ”‘రాజకీయ నాయకులలో మౌలికంగా రెండు రకాలవారు ఉంటారు.1) తమను తాము అనివార్యమైనవారుగా భావించుకునే వారు;2) అలా భావించుకోనివారు అని పేర్కొన్నారు తమ నాయకత్వం అనివార్యమని భావించుకోని నాయకులూ చాల అరుదుగా ఉంటారు. తమ అనుయాయులను కూడా పూర్తిగా విశ్వసించని నాయకులే సర్వసాధారణంగా కనబడుతూ ఉంటారు, అటువంటివారు తమ అనుయాయులకు స్వతంత్రంగా పని చేసే సేచ్ఛను ఇచ్చేందుకు సుముఖంగా ఉండరు తమ పక్కన స్వేచ్ఛగా ఆత్మ విశ్వాసంతో ఉండేవారికంటే ఎక్కువగా యాంత్రికంగా, భావావేశ రహితంగా పనిచేసే వారే తమ వెనుక ఉండాలని ఈ నాయకులు కోరుకుంటారు. వీరు ఎలాంటి అభిప్రాయ భేదాలను సహించరు స్నేహపూరిత విమర్శలను నిరసిస్తారు. ఇటువంటి వారు శాశ్వతంగా నిష్క్రమించినప్పుడు ఒక నిస్సహయ శూన్య స్థితి ఏర్పడుతుంది అది ఆ పార్టీ మనుగడనే ప్రశ్నర్ధకం చేస్తుంది స్వామినాథన్ అదే ప్రసంగంలో ఇంకా ఇలా అన్నారు:అటువంటి నియంతృత్వ నాయకత్వం మనకు అవసరం లేదు
ప్రాంతీయ పార్టీ లు నియంతృత్వానికి చిరునామానా ?
ప్రభుత్వ నాయకుడు సంపూర్ణాధికారాన్ని చెలాయించే ధోరణులు కేంద్రంలో కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు సాగేది, అదే రాష్ట్ర ప్రభుత్వాలకి పాకింది.పలు రాష్ట్ర ప్రభుత్వాలలో ఇప్పుడు కూడా ఆ ధోరణే వ్యక్తమవుతున్నాయనే వాస్తవాన్ని మనం గమనించ వచ్చు . బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బెంగాలీ ప్రజలకు తాను ఒక తిరుగులేని అధినేత్రిగా ఆరాధనలు అందుకుంటున్నారు. మూర్తీభవించిన అధికార స్వరూపిణిగా ఆమె వెలుగొందుతున్నారు.పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఏమి చేయడానికి ప్రయత్నిస్తున్నారో అదే తమ తమ రాష్ట్రాల్లో చేసేందుకు ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్ (ఢిల్లీ), పినరాయి విజయన్ (కేరళ), వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (ఆంధ్రప్రదేశ్), కె.చంద్రశేఖరరావు (తెలంగాణ), అశోక్ గెహ్లాట్ (రాజస్థాన్) ప్రయత్నిస్తున్నారు. ఈఆరుగురు ముఖ్యమంత్రులు భిన్న రాజకీయ పార్టీలకు చెందినవారు. అయిన స్వాభావికంగానూ, పాలనా శైలిలోనూ వారిది ఒకే తీరు. అది నిరంకుశత్వము . ప్రొఫెసర్ స్వామినాథన్ నేడు సజీవులై ఉండి ఈ ముఖ్యమంత్రుల తీరుతెన్నులను గమనించి ఉంటే ఏమి వ్యాఖ్యానించే వారో స్పష్టమే. భిన్నాభిప్రాయాలను సహించరని, స్నేహపూరిత విమర్శలను తిరస్కరిస్తారని, స్వతంత్ర వైఖరితో కాకుండా యాంత్రికంగ ఆ పనిచేసే వారే తమ అనుయాయులుగా ఉండాలని కోరుకుంటారని స్వామినాథన్ తప్పక నిరసించేవారు. స్వాతంత్ర పోరాట సమయంలో ముస్లిం లను కలుపుకొని పోవాలనే ఆరాటం లో జిన్నాప్రతిపాదించిన ద్విజాతి సిద్ధాంతాన్నివిస్మరిస్తూ హిదువులను హిందుత్వాన్ని విమర్శిస్తూ దేశవిభజనకు కాంగ్రెస్ కారణమైనది, ఒకవేళ ఆ రోజులలోకాంగ్రెస్ హిందూ సంస్థల సహకారం తీసుకొని ఉంటె దేశవిభజన ను నివారించ గలిగిఉండేది , దేశవిభజన తరువాత నైనా కాంగ్రెస్ మారిందా అంటే లేదు పైగా ఇప్పటి ప్రాంతీయ పార్టీ లు కూడా తమ అధికారాన్ని కాపాడుకొనేందుకు ఇస్లాం ఆక్రమణ ,మతం మార్పిడులు, దాడులు కప్పిపుచ్చేందుకు వాటన్నిటికీ హిందువులనే కారకులుగా చూపిస్తున్నారు, అదే నీతి కొనసాగుతున్నది వీళ్లకు తోడుగా వామపక్ష లావాళ్లు, ఉదారవాద మేధావులు , వీళ్ళందరూ కలసి జిన్నా ఆ కాలంలో హిందూ ముస్లిం విభజనకు ఎలా ప్రయత్నించాడో వీళ్ళు అదేపని ఈ రోజు చేస్తున్నారు, ఇది దేశాన్ని ఎటు తీసుకొనివెళ్ళుతుంది ? .తామే సర్వస్వము అనుకొనే వాళ్ళు మీడియాను అణచివేసేందుకు, రాజకీయ అసమ్మతివాదులను నిర్బంధించేందుకు రాజ్యాధికారాన్ని దుర్వినియోగపరచడంలో కూడా ఎటువంటి సంకోచాలు లేకుండా వ్యవహరిస్తున్నారు. మమత, కేజ్రీవాల్ మొదలైన వారి రాజకీయాలు కూడా సొంత బలాన్ని పెంపొందించుకునేందుకు, వ్యక్తిగత అధికారాన్ని పటిష్ఠం చేసుకునేందుకు అగ్రప్రాధాన్యమిస్తున్నాయి. ఆ లక్ష్యాల సాధనకు రాజ్యాధికారాన్ని, ప్రభుత్వ నిధులను ఉపయోగించుకోవడానికి కూడా వాళ్ళు వెనుకాడడం లేదు.
సర్వోత్కృష్ట నాయకుల ఆరాధన సాధారణంగా సైనిక నియంతృత్వాలు, ఫాసిస్టు రాజ్యాలు, కమ్యూనిస్టు పాలనావ్యవస్థలలో కనబడుతుంది ఒక వ్యక్తి అత్యున్నత అధికార పదవిని అధిష్టించగలిగితే అతడు పౌరులందరికి ప్రాతినిధ్యం వహిస్తాడని భావించటం ప్రజాస్వామ్య భావనకు పూర్తిగా విరుద్ధమైనది. భారత స్వాతంత్ర్య అమృతోత్సవాల తరుణంలో మన ప్రజాస్వామ్యం అంతకంతకూ ప్రాంతీయ పార్టీ ల నిరంకుశ పాలనలోకి వెళుతోంది. ఇది మనకు అన్ని విధాల సవాలే.
అధికారాన్ని తమ చేతులలో ఉంచుకోవాలనుకోవటమే అసలైన సమస్యనా?
అధికారాన్ని సంపూర్ణంగా చెలాయించడం ద్వారా తమను తాము ఉన్నతీకరించుకోవడం పైనే దృష్టి నిలిపే నాయకులు అభివృద్ధి సాధన, పాలనా బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తారు. విధాన నిర్ణయ అధికారాలను సంపూర్ణంగా స్వాయత్తం చేసుకుని, మంత్రులు, సివిల్ సర్వెంట్స్కు అధికారాలను అప్పగించేందుకు నిరాకరించే నాయకులు భారత్ను కాదు కదా, వైశాల్యం, జనాభా, వైవిధ్యం పరంగా పెద్ద రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాన్నీ సమర్థంగా పాలించలేరు. మరింత స్పష్టంగా చెప్పాలంటే పాలనా బాధ్యతలకు వారు అనర్హులు. విధేయులు, భజనపరుల మెచ్చుకోలు మాటలకు మురిసిపోయే నాయకులు ప్రధానమంత్రులుగా లేదా ముఖ్యమంత్రులుగా విఫలమవుతారు. రాజకీయ సహచరులు, ప్రత్యర్థులు , స్వతంత్ర మీడియా సలహాలు, విమర్శలను అంగీకరించరు. వాటికి అసలు ప్రతిస్పందించనే ప్రతిస్పందించరు. మరి ఇటువంటి నాయకులు పాలకులు అయినప్పుడు జరిగేదేమిటి? ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులు కేంద్రాన్ని వ్యతిరేకిస్తూ తమ అవసరార్ధం వ్యవరిస్తూ దేశాభివృద్ధిలో అవరోధాలు కలిగిస్తూ రాష్ట్రాలను అప్పులపాలు చేసి సంకటాలు నిర్మాణం చేస్తూ దేశ ఆర్థిక సామర్థ్యం సంపూర్ణంగా వికసించనివ్వటం లేదు సమాజంలో సామరస్య జీవనం అసాధ్యమవుతోంది ; మన జాతీయ భద్రతకు భరోసా ఉండదు. రాష్ట్రాలలో నిరంకుశ ముఖ్యమంత్రుల మూలంగా మన భవిష్యత్తు అపాయంలో పడుతుంది. వివిధ రంగాల నిపుణులతో పాటు, దేశ పౌరుల సలహాలు, సూచనలను వినేవారు, విని నేర్చుకునే నాయకులు మాత్రమే భారత్ శ్రేయస్సుకు, భారతీయుల అభ్యున్నతికి మహోదాత్తంగా దోహదం చేయగలరు. మంత్రులకు అధికారాలను బదిలీ చేసేవారు, రాజ్యాంగ సంస్థల స్వతంత్ర ప్రతిపత్తిని, పత్రికా స్వాతంత్ర్యాన్ని గౌరవించేవారు, అందరిని కలుపుకుపోయే నాయకులు మాత్రమే దేశానికీ మేలుచేయగలుగుతారు.. అస్థిర శక్తుల చేతుల లోనుండి దేశాన్ని కాపాడుతూ దేశంలో ఆరోగ్యవంతమైన రాజకీయ స్థిరత్వం కోసం దేశ ప్రజలందరూ ఆలోచించాలి. ~ NewsBharatiyam