
యూపీఏ మాజీ రక్షణ మంత్రి ఏ.కె ఆంథోని 2013లో పార్లమెంట్ లో మాట్లాడుతూ,,
1. నిజాన్ని ఒప్పుకోడానికి నాకు అనుమానం ఏమీ లేదు.
2. భారత్ బోర్డర్ ఏరియా తో పోలిస్తే చైనా తన బోర్డర్ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆధునాతనంగా నిర్మించుకుంది.
3. బోర్డర్ దగ్గర చైనా వారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దేశం కంటే చాలా సుపీరియర్.
4. మనం వాళ్ళను అందుకోడానికి ప్రయత్నిస్తున్నాం.
5. దీని వెనుక చరిత్ర ఉంది. ఏమిటి ఆ చరిత్ర?
6. భారత్ కి స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుండి చాలా సంవత్సరాలు ఒక పాలసీ అవలంబించింది. ఏమిటంటే అది – బోర్డర్స్ అభివృద్ధి చేయకుండా ఉండడమే ‘అత్యుత్తమ రక్షణ విధానం” గా అవలంబించింది. అంటే
‘అభివృద్ది చేయబడని’ బోర్డర్స్, అభివృద్ధి చేసిన బోర్డర్స్ కంటే ఎక్కువ రక్షణ ఇస్తాయి అని ఉద్దేశ్యం. (అంటే మన బోర్డర్ వైపు మంచి రోడ్లు, వంతెనలు ఎయిర్ పోర్టులు మనం కడితే వాటినే చైనా వాడు వాడుకొని మన దేశం మీద దండయాత్ర చేస్తాడు అని భయంచేత మనదేశంలో బోర్డర్ దగ్గర మనం రోడ్లు వంతెనలు నిర్మించుకోలేదు అన్నమాట)
7. అందువల్లే చాలా సంవత్సరాలు బోర్డర్స్ లో రోడ్లు నిర్మాణం చెయ్యలేదు, ఎయిర్ ఫీల్డ్స్ కట్టలేదు. .
8. కానీ ఆ సమయంలో చైనా తన బోర్డర్స్ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేసుకుంది.
9. దానివల్ల బోర్డర్ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి విషయంలో చైనా మనకంటే చాలా ముందు ఉంది.
10. బోర్డర్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా గానీ, సమర్ధత విషయంలో కానీ చైనా మన దేశం కంటే ఎంతో ముందు ఉంది..
” ఇది నేను ఒప్పుకుంటున్నాను -అది చరిత్రలో ఒక భాగం”
—- ఏకే అంథోనీ, UPA రక్షణశాఖ మంత్రి
60 సం. ల కాంగ్రెస్ ఆలోచనా విధానానికి రక్షణ మంత్రి గారి ఈ ప్రకటన ఒక రుజువు.
అయినా నాకు అర్ధం కానిది చైనా వాడు వాడి బోర్డర్స్ లో రోడ్లు ఎయిర్ పోర్ట్స్ కట్టేసుకున్నాక మనం కట్టుకోకపోతే వాళ్ళు మన దేశంలోకి వాళ్ళు రాలేరా?
అంటే ఆ గొప్ప పాలసీ వల్ల 60 ఏళ్ల పాలనలో ఈశాన్య రాష్ట్రాలను, దేశ సరిహద్దులను నిర్లక్ష్యం చేసి రోడ్లు, రైళ్లు, వంతెనలు, ఎయిర్ పోర్ట్స్ అతి తక్కువ కట్టారు.
వెనకటికి ఎవడో అన్నాడట కూరగాయలు ముక్కలు చేయడానికి అంత ఇబ్బంది పడడం ఎందుకు ఒక కత్తి కొనుక్కోవచ్చు కదా అని అడిగితే ! అమ్మో ఎవడైనా దొంగోడు వచ్చి అదే కత్తితో నన్ను పొడిచేస్తే అన్నాడట…అలా ఉంది వ్యవహారం.
మన దేశం పెద్ద దేశం అయి ఉండి మంచి మిలటరీ శక్తి ఉండి కూడా చైనాతో కానీ పాక్ తో కానీ అంత రక్షణాత్మకంగా (defensive) వ్యవహరించడానికి కారణం ఏమిటి?
చైనా మన కంటే చాలా బలమైన దేశం. దానితో విరోధం మనకే ప్రమాదం అని వామపక్ష ఉదారవాద భావజాలానికి ప్రభావితమైన కాంగ్రెస్ కాదా?
ఆఫ్టర్ అల్ మన ముందు పాకిస్థాన్ దేశం ఎంత? అటువంటి దేశం 70 సం. లుగా మనలని రోజూ ఏడిపిస్తున్నాది అంటే కారణం ఏమిటి? మన దేశం ఏ నగరంలో ఎప్పుడు కావాలి అంటే అప్పుడు బాంబులు పేల్చుకోగల ధైర్యం ఆ దేశానికి ఎలా వచ్చింది?
భారత్ ని ఎన్ని సార్లు గిల్లినా ఏడుస్తారు మహా అయితే ఒక “ఘాట్టి హెచ్చరిక” చేస్తారు తప్ప తిరిగి చాచి లెంప కాయ కొట్టరు అనే ధైర్యం కాదూ ఆ దేశ పాలకులకు?
ఆ ధైర్యం పాక్ కి, చైనా కి ఎవరు ఇచ్చారు? మన దేశ విదేశాంగ విధానాలను ఎక్కువగా ప్రభావితం చేసే వామపక్ష ఉదారవాద భావజాలం కల మేధావులు కాదూ? పాక్ ఎన్ని సార్లు రెచ్చగొట్టినా ఆ దేశంతో మంచి సంబంధాలు నెరపాలి అని మనకే సూక్తులు చెపుతారు. కానీ అక్కడ మీటింగ్ లకు, డిన్నర్లకు, పార్టీలకు రెగ్యులర్ గా హాజరయ్యే మన దేశపు ఏ ఒక్క ఉదారమేధావి మీ దేశం ఉగ్రవాదులను మా దేశంలోకి పంపించడం ఆపేయ్యండి సంబంధాలు బాగవుతాయి అని పాకిస్తాన్ కి గట్టిగా చెప్పారా? చెప్పరు.
అలాగే చైనా విషయంలోనూ…..
చైనా వాళ్ళు మన భూభాగంలోకి రావడం మోడీ అడ్డుకోలేదు అని విమర్శిస్తారు కానీ ఈ వామపక్ష మేధావులకు చైనాతో చాలా సత్సంబంధాలు ఉన్నాయి కదా! ఇలా మా దేశం బోర్డర్స్ లోకి జొరపడడం అంతర్జాతీయ రూల్స్ ని ఉల్లఘించడం కిందకు వస్తుంది. మీరు అటువంటి ప్రయత్నాలు ఆపండి అని చైనాకు ఒక్క సారి అయినా విజ్ఞప్తి చేశారా? చెయ్యరు. అలా
చేస్తే వీళ్ళు నిర్వహించే రక రకాల దేశ విచ్చిన్నకర ఆందోళనలకు, కార్యకలాపాలకు ఫండ్స్ ఆగిపోతాయి. వీరికి చైనా పర్యటనలు, చైనా పరోక్షంగా స్పాన్సర్ చేసే విదేశీ పర్యటనలు ఆగి పోతాయి. వీరి మీడియాకు చైనా ప్రకటనల డబ్బులు ఆగిపోతాయి. పై పెచ్చు చైనాను మన దేశమే ఇబ్బంది పెడుతోంది అని సిగ్గులేకుండా చైనాను వెనకేసుకు రావడం. చైనాతో ఏకంగా కాంగ్రెస్ పార్టీ రహస్య వప్పొందం కుదుర్చుకోవడం. సైన్యాన్నే నేరుగా విమర్శించడం మొదలగునవి చేస్తూ ఉంటారు. వీళ్లకు భారత దేశం బాగు కంటే వాళ్ళ సిద్ధాంతం, వాళ్లకు వచ్చే అవార్డులు, రివార్డులు ఎక్కువ.
మోడీ ప్రభుత్వం గత 5 సం.లుగా బోర్డర్స్ లో నిర్మించిన రోడ్లు వివరాలు క్రింద ఫొటోలో ఉన్నాయి చూడండి.
స్వాతంత్రం వచ్చిన తరువాత ఏ ప్రభుత్వం పెట్టనంత ఎక్కువుగా దేశ రక్షణ మీద, ఈశాన్య రాష్ట్రాల ఇన్ఫ్రా మీద శ్రద్ధ పెడుతున్న మోడీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్, వామపక్ష మేధావులు ఆ చర్యలు పాక్ కి చైనా కి ఇబ్బందులు కలుగచేస్తాయి అని అందుకే సిగ్గులేకుండా మోడీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.
ఈ క్రింద వీడియోలో అప్పటి రక్షణ మంత్రి ఆంథోని ఏం మాట్లాడారో చూడండి.
~ Chada Sastry