కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా… ప్రధానమంత్రి విద్యార్హత గురించిన చర్చనడుస్తోంది. 5 రోజుల క్రితం ఆయన విద్యార్హతల సర్టిఫికెట్లను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని గుజరాత్ కోర్టు తీర్పునిచ్చింది. దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈ సందర్భంలోనే సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ ఓ ట్వీట్ చేస్తూ… 45 సెకన్ల ఓవీడియోను జత చేశారు. అందులో ఏముందో ఓ సారి చూద్దాం…
నేను స్కూల్ కి వెళ్లి మాత్రమే చదువుకున్నాను అది వీడియోలో ఉంది. మోదీ ఆనాడు స్వయంగా చెప్పుకున్నాడు తాను పాఠశాల విద్య మాత్రమే పూర్తి చేసినట్టు గతంలో మోదీనే స్వయంగా అంగీకరించారు అని ప్రశాంత్ భూషణ్ చెప్పారు. ఇక అప్పుడు 2000 సంవత్సరంలో మోదీని ఇంటర్వ్యూ చేసిన రాజీవ్ శుక్లా తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీ కూడా అయ్యారు. నాటికి మోదీ పార్టీ జనరల్ సెక్రటరీ మాత్రమే.
ఇక ఆ ఇంటర్వ్యూలో మోదీ తాను స్కూల్ చదువే చదివానని మాత్రమే చెప్పలేదు. ఒక ఆర్ఎస్ఎస్ ప్రచారక్ చెప్పడంతో తరువాత డిగ్రీ, ఎంఏ ప్రైవేట్ గా చేశాననీ అందులో మోదీ చెప్పారు..పూర్తి వీడియో చూడండి…
ఈ విషయాన్ని నాడు ఇంటర్వ్యూ చేసిన రాజీవ్ శుక్లా కాంగ్రెస్ ఎంపీగా ఉండగా…దాదాపు ఆరేళ్ల క్రితం మోదీ ప్రధాని అయిన తరువాత అంగీకరించారు. మెదీ బీఏ, ఎంఏ ప్రైవేటుగా చదివినట్టు తన ఇంటర్వ్యూలో చెప్పారని నిర్ధారించారుకూడా. ఇక సర్టిఫికెట్లో ఉన్న ఫాంట్ గురించి మేధావులమని చెప్పుకునే కొందరు వితండవాదం చేయడం హాస్యాస్పదం. హాస్యాస్పదం అనేకన్నా అసహ్యకరం అనొచ్చేమో.
1983 సర్టిఫికెట్ లో ఈ ఫాంట్ ఎలా వచ్చింది అని ప్రశ్నలు లేవనెత్తారు. అంతకుముందు కనీసం వందరకాల ఇంగ్లిష్ ఫాంట్స్ ఉండేవి..ఈ సర్టిఫికెట్లో ఉన్న ఫాంట్..1936లో న్యూయార్క్ టైమ్స్ పేపర్ ఫాంట్ ఒకటే..ఇక 70.80ల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్ఎస్ఎస్సీ బోర్డు మీద ఇదే ఫాంట్ ఉంది..మీరిప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు.
అప్పటికి మైక్రోసాఫ్ట్ ఫాంట్ లేదు కాబట్టి నా 10TH సర్టిఫికెట్ ఫేక్ అని వీళ్ళ ఉద్దేశం. కానీ వాస్తవాలతో వాళ్లకు పనిలేదు. మేధావులం అనుకుంటారు కనుక.
ఇంకా ఆ సర్టిఫికెట్ల మీద సంతకాలేవీ అని మరికొందరు అంటున్నారు. ప్రమాదవశాత్తునో, నిర్లక్ష్యం వల్లనో ఒరిజినల్ సర్టిఫికెట్లు పోయిన వాళ్లకు ఆ విషయం తెలుస్తుంది. ఇప్పుడంటే డిజిటల్ యుగంలో ఎక్కడోఓ చోట సర్టిఫికెట్లను సేవ్ చేసుకునే అవకాశం ఉంది. అప్పుడలా లేదు ఒరిజినల్ ప్రింటెండ్ జాగ్రత్తగా పెట్టుకోవాల్సిందే. ముందు ఏ స్టూడెంట్ కైనా యూనివర్సిటీ ఒరిజినల్ సర్టిఫికెటే ఇస్తారు. వాళ్ల దగ్గర కాపీలు ఉండవు. మార్కులు మాత్రమే ఉంటాయి. పాస్ , ఫెయిల్ వివరాలుంటాయి. ఒరిజినల్ సర్టిఫికెట్ కనుక మిస్సైతే…పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి.. డూప్లికేట్ కి అప్లై చేస్తే… ఏ సంతకాలు లేకుండా ఆ స్థానంలో sd,/xxx అని రాసి దాని కింద అప్పటి రిజిస్ట్రార్ పేరు కానీ కంట్రోలర్ ఆఫ్ exams లేదా VC పేరు కానీ (పేర్లు అందుబాటులో ఉంటే) రాస్తారు. సర్టిఫికేట్ మీద డూప్లికేట్ అని రాసి ఇస్తారు.
ఇందాక చెప్పాకదా మోదీ 2000లో చేసిన వీడియోను మీరు చూశారు. 2001లో మోదీ మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటికి ఆయనకు ఇల్లు వాకిలీ లేదు. ఆర్ఎస్ఎస్, పార్టీ ఫుల్ టైమర్ గా ఉండేవారు. అంటే ఎప్పుడూ ఏదో ప్రాంతానికి తిరుగుతూ ఉండేవారు. పార్టీకి ఎక్కడికి పంపితే అక్కడికి ఓ సంచీ తగిలించుకుని వెళ్లడమే. పార్టీ సంబంధీకుల ఇళ్లళ్లో భోజనం, ఎక్కడికి వెళ్తే అక్కడ పార్టీ, సంఘ కార్యాలయంలో బస. ఇక సర్టిఫికెట్స్ ఎక్కడ దాచిపెట్టుకుంటాడు. ఆ సర్టిఫికెట్లుంటే ఉద్యోగం వస్తుంది..నాకు ఉపాధి చూపేవి ఇవే అనే ఆలోచనలూ మోదీ లాంటివారికి ఉండవు…ఎందుకంటే అతిచిన్న వయసులోనే ఆర్ఎస్ఎస్ లో చేరి.. తరువాత పార్టీలో యాక్టివ్ అయ్యి.. కుటుంబానికి సైతం దూరంగా వచ్చారు. పూర్తిస్థాయి ప్రజాసేవే ఆయన లక్ష్యం. మరి ఎలాంటి పదవిలోని ఆ సమయంలో ఆయనకు తన విద్యార్హత గురించి అబద్దాలు ఆడవల్సిన అవసరం ఏంటి.. ఆలోచించిండి.
ఇక యూనివర్సిటీ UNIVERSITY బదులు సర్టిఫికెట్ లో
‘Unibersity’ అని విదేశాల్లో చదివిన టెక్కీలం అని చెప్పుకునే మరికొందరు హేళన చేస్తున్నారు. అది కూడా ఓల్డ్ ఇంగ్లిష్ ఫాంట్ వల్ల ‘v’ ‘b’ లాగా కనిపిస్తోంది. ఈ క్రింద ఇచ్చిన లింక్ సైట్ లోకి వెళ్లి ‘university’అని టైప్ చేసి చూడండి.
https://www.1001fonts.com/old-english-fonts.html
ఇక “MA Entire Political Science” అనే కోర్సే లేదు అని మరికొందరు మేధావులంటున్నారు. అయితే అప్పట్లో గుజరాత్ యూనివర్సిటీలో సంపూర్ణ రాజ్యశాస్త్ర కోర్సు ఉండేది. దాన్నే ఇంగ్లిష్ లో ” Entire Political Science”అంటారన్నమాట. 6 సం. ల క్రిందట NDTV న్యూస్ లో న్యూస్ రీడర్, బీజేపీకి బద్దవ్యతిరేకి అయిన రవిష్ కుమార్ ఆ విషయాన్ని చెప్పారు.. చూడండి మీరే. “MA Entire Political Science” అనే డిగ్రీ పేరు ఎప్పుడూ వినలేదు అని అంతా అంటున్నారు, కానీ మా సమాచారం ప్రకారం అప్పట్లో గుజరాత్ యూనివర్సిటీ లో “సంపూర్ణ రాజ్యశాస్త్ర” అనే డిగ్రీ ఉండేది అని రవిష్ అన్నమాట.
ఇక కేజ్రీవాల్ ఆరోపణ చేసిన తరువాత అమిత్ షా మరియు అరుణ్ జైట్లీ మోడీ BA, MA సర్టిఫికెట్ లు బహిర్గత పరిచారు. ఆ తరువాత మరెప్పుడూ కేజ్రీవాల్ సహా మరెవరూ ఇప్పటివరకు అవి ఫేక్ అని అధికారికంగా క్లెయిమ్ చేయలేకపోయారు.
ఇప్పుడు గుజరాత్ కోర్టు స్పష్టత ఇచ్చిన తరువాత కూడా కేజ్రీవాల్ రాద్దాంతం చేయడం, కోర్టు ధిక్కరణ వ్యాఖ్యలు చేయడం …మిగిలినవాళ్లూ అందుకుని కట్టగట్టుకునిగోల చేయడం వెనక కారణం, వాళ్ల వ్యూహాన్ని అందరూ అర్థం చేసుకోవాలి.
Courtesy: Chada Sastry