ఇంత దారుణమా.. రామ మందిర నిర్మాణానికి విరాళాలు సేకరిస్తున్న బజరంగ్ దళ్ కార్యకర్తపై మూకదాడి
దేశ రాజధాని ఢిల్లీలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలోని మంగోల్పురి ప్రాంతంలో రామ మందిర నిర్మాణానికి నిధి సేకరిస్తున్న రింకు శర్మ అనే బజరంగ్ దళ్ కార్యకర్తపై కత్తులతో దాడి చేశాయి అల్లరిమూకలు. రింకు శర్మ నివాసంపై ఫిబ్రవరి 10వ తేదీన దాదాపు 25 ఉనంచి 30 మంది దాడికి దిగారు. కత్తులు, లాఠీలు, రాడ్లతో రింకు శర్మపై దాడి చేశారు. కుటుంబ సభ్యులు చూస్తుండగానే.. విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. అంతేకాదు.. తలపై మోదేందుకు ఎల్పీజీ సిలిండర్ను కూడా ఎత్తబోయారు. ఆ సమయంలో రింకు శర్మ కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో సిలిండర్ వదిలేసి.. కత్తులతో పొడిచేశారు. దీంతో రింకు శర్మ రక్తపు మడుగులో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు రింకు శర్మను స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. ఫిబ్రవరి 11వ తేదీన తుదిశ్వాస విడిచాడు రింకు శర్మ. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను మృతుడు రింకు శర్మ సోదరుడు ఓ జాతీయ పత్రికకు వివరించాడు. గత నెల నుంచి రామ మందిర నిర్మాణా నిధి సేకరణలో భాగంగా తన సోదరుడు ఆ ప్రాంతంలోని ప్రజలకు రామ మందిర చరిత్ర వివరిస్తూ.. నిధులు సేకరిస్తున్నారని.. ఈ క్రమంలో ఇదే ప్రాంతంలో ఉండే మహ్మద్ ఇస్లాం, డానిష్ నస్రుద్దీన్, దిల్షాన్, దిల్షాన్ ఇస్లాంలు గత నెలలో జరిగిన రామ మందిర నిధి సేకరణ చేపడుతుండగా అడ్డుపడ్డారని తెలిపాడు. అనంతరం స్థానిక పెద్దల కలుగజేసుకుని సముదాయించి పంపిచేశారని తెలిపాడు.
అయితే అనూహ్యంగా మహ్మద్ ఇస్లాం, డానిష్ నస్రుద్దీన్, దిల్షాన్, దిల్షాన్ ఇస్లాంలు కొందరిని తీసుకుని తమ ఇంటిపై దాడికి పాల్పడి.. తమ సోదరుడిని విచక్షణారహితంగా కత్తులతో పొడిచి హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మహ్మద్ ఇస్లాం, డానిష్ నస్రుద్దీన్, దిల్షాన్, దిల్షాన్ ఇస్లాంలను అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సుప్రీ కోర్టు తీర్పుకు లోబడి మందిర నిర్మాణం చేపడుతున్న సమయంలో ఇలాంటి ఘటనలు జరగడం సహించేది కాదని.. విశ్వ హిందూ పరిషత్ అధికార ప్రతినిధి సురేంద్ర జైన్ అన్నారు.