అయోధ్య ఆలయానికి దొరగారు వ్యతిరేకమా?
సుమారు ఐదు శతాబ్దాల పోరాటం. దశాబ్దాల తరబడి న్యాయపోరాటం. చివరకు ధర్మమే గెలిచింది. అయోధ్యలో రామజన్మభూమి స్థలంలో ఆలయ నిర్మాణానికి ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం అనుమతినిచ్చింది. వంద కోట్ల మంది హిందువుల హృదయాలు ఆనందంతో ఉప్పొంగే తరుణమిది. కానీ కోరుట్ల టిఆర్ ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాత్రం ఆ గుడికి వ్యతిరేకంగా మాట్లాడారు. తమ నాయకుడి ఇంటిపేరు, ఈ ఎమ్మెల్యే ఇంటి పేరు ఒక్కటే.
ఆ పార్టీలో ఓటు బ్యాంకు రాజకీయాలకే తప్ప, మనసుకు, మనస్సాక్షికి, ఆత్మాభిమానానికి తావులేదని ఇప్పటికి చాలా సార్లు రుజువైంది. కెసిఆర్ హుకుం మాత్రమే నడిచే పార్టీ అది. అంటే కోరుట్ల ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు, వాళ్ల నాయకుడు కెసిఆర్ మనసులో ఉన్నవేనా? ఆయన వివిధ సందర్భాల్లో తన వాళ్లకు నూరిపోసినవేనా? అనేది దొరగారు చెప్పాల్సిన అవసరం ఉంది.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలో నేనే అసలు సిసలైన హిందువులను అని పేజీల కొద్దీ వార్తలు నమస్తే తెలంగాణలో రాయించుకున్నారు. ఇప్పుడు ఆయోధ్య రామాలయానికి వ్యతిరేకంగా తన పార్టీ వాళ్లు మాట్లాడుతున్నా మౌనంగా ఉంటారా? ముఖ్యమంత్రికి చాలా పనులుంటాయని కొత్త విషయాన్ని కనుక్కుని చెప్పారు ముఖ్యమైన మంత్రి కెటిఆర్. మరి రాముడి పేరు పెట్టుకున్న ఈ టిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా తమ పార్టీ స్టాండ్ ఏమిటో చెప్తారా? ఎవరేమనుకుంటే మాకేం. అని ఊరుకుంటారా? చూద్దాం.