మునుగోడు ఎన్నికల వేళ రకరకాల ఫేక్ వీడియోస్, న్యూస్ వైరల్ అవుతున్నాయి. నిన్నటికి నిన్న మునుగోడు ఎన్నికపై ఆర్ఎస్ఎస్ సర్వే చేసింది.అందులో టీఆర్ఎస్ గెలుస్తోందంటూ ఓ సర్వే రిపోర్ట్ బయటకు వచ్చింది. అయితే ఫ్యాక్ట్ చెక్ చేయగా అది ఫేక్ అనితేలింది. స్వయంగా సంఘ్ ప్రాంత కార్యవాహ పేరుతో ప్రకటన వచ్చింది. దాన్ని ఖండిస్తూ.

Fake News
ఇక మునుగోడుకు సంబంధించి మరో వార్త వైరల్ అవుతోంది. ఏంటంటే బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఓటర్లకు ఇంటింటికీ గ్రామ్ బరువైన బంగారు నాణేలు పంచుతున్నారు.మోదీ ఫోటోతో పాటు ఆ కాయిన్ ను కవర్లో పెట్టి బీజేపీ ఇంటింటకీ ఇస్తోంది అని.

Old Tweet ( Year – 2021)
అయితే ఫాక్ట్ చెక్ లో భాగంగా కీ వర్ట్స్ సెర్చ్ చేయగా అది ఫేక్ అని తేలింది. గతంలో కాయిన్ కి సంబంధించి చేసిన ట్వీట్లు కనిపించాయి. 2021 పుదుచ్చేరిఎన్నికల సందర్భంగా తిరునల్లూర్లో ఆ గోల్డ్ కాయిన్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ఇంట్లో మొత్తం 150 కాయిన్స్ పట్టుకున్నారు. ఆ ఘటనలో కేసు నమోదైనట్టు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసు అధికారులు స్వయంగా ట్వీట్ చేశారు.
ఎన్నిక జరుగుతున్న మునుగోడులోని గట్టుప్పల్ మండలానికి చెందిన ఓ వాట్సప్ గ్రూప్ లో ముందుగా ఈ ఫేక్ న్యూస్ వచ్చినట్టు తెలిసింది. ఆ కాయిన్స్ మునుగోడులోనే దొరికాయంటూ కొందరు దాన్ని రకరకాల మాధ్యమాల ద్వారా వైరల్ చేశారు.
ఈ వార్త పూర్తిగా ఫేక్. పూర్తిగా నిర్ధారణ చేసుకున్నతరువాతే వ్యాప్తి చేయండి. ఇలాంటి పేక్స్ న్యూస్ స్ప్రెడ్ చేయడం ద్వారా సమాజంలో, ప్రజల్లో గందరగోళ పరిస్థితికి కారకులు కావద్దు. అందరూ బాధ్యతగా ఉండాలి.
-మైఇండ్ మీడియా