రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని అమేథీ ఎంపీ, కేంద్రమంత్రి స్మృతీఇరానీకి ఆహ్వానం అందింది. . ఉత్తరప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ నేత దీపక్ సింగ్ పార్టీ తరఫున ఈ ఆహ్వానం పంపారు. గౌరిగంజల్లోని స్మృతి ఇరానీ కార్యాలయంలో ఆమె కార్యదర్శి నరేష్ శర్మకు లేఖ అందించారు. అయితే స్మృతి ఇరానీకి ఆహ్వానంపై బీజేపీస్పందించింది. ‘బీజేపీ ఎప్పుడు పనిచేసినా దేశ సమైక్యత కోసమే పనిచేస్తుందని… దేశం ఇప్పుడేం ముక్కలైందని యాత్రలో చేరాలి? అంపశయ్యపై ఉన్న కాంగ్రెస్ను పునరుద్ధరించేందుకు రాహుల్ గాంధీ ఈ యాత్ర చేపట్టారని ఆయన అన్నారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర జనవరి 3న ఘజియాబాద్ మీదుగా ఉత్తరప్రదేశ్లోకి అడుగుపెట్టనుంది.