
ఆర్ధిక మందగమనం అంతర్జాతీయంగా ఇప్పటికే ప్రభావం చూపిస్తున్నదా?
లేక ముందు జాగ్రత్తగా రాబోయే రీసెషన్ కి భయపడి ఇప్పటి నుండే జాగ్రత్త పడుతున్నాయా ?
కోవిడ్ లాక్ డౌన్ తరువాత IT రంగం మళ్ళీ పుంజుకొని మునపటిలాగా విస్తరిస్తుంది అని భావించారు. ఇన్వెస్టర్లు కూడా IT రంగం మీదనే ఎక్కువ మక్కువ చూపించారు. వెంచర్ కాపిటల్ సంస్థల నుండి IT సంస్థలకి పెట్టుబడులు పెరగడం తో ఒక దశలో IT రంగ సంస్థ షేర్లు ఆకాశంలోకి వెళ్లిపోయాయి.
పెట్టుబడి దారుల విశ్వాసాన్ని పెంచడానికి అంటూ IT సంస్థలు తమ ఖర్చులని తగ్గించుకొని ఆ నిధులని డెవలప్మెంట్ మీద పెట్టుబడిగా పెట్టాయి. మరో వైపు వెంచర్ కాపీటలిస్ట్ ల నుండి నిధులు ఇబ్బడి ముబ్బడిగా రావడం వలన ఉద్యోగుల జీతాల కోసం భయపడాల్సిన అవసరం రాలేదు. దాంతో 100 మంది కి బదులుగా 150 మందిని రిక్రూట్ చేసుకున్నాయి చాలా సంస్థలు. ఇక్కడ రిజర్వ్ బెంచ్ లో కావాల్సిన దాని కంటే 10% కంటే ఎక్కువగా రిక్రూట్ చేసుకున్నాయి.
ఇదంతా పోయిన సంవత్సరం లాక్ డౌన్ తరువాత జరిగిన విషయం. ఈ సంవత్సరం మొదట్లో IT రంగ వృద్ధి మునపటి లాగానే తిరిగి పుంజుకునే అవకాశాలు ఉన్నాయని భావించారు నిపుణులు. లాడ్ డౌన్ సమయంలో సబ్ కాంట్రాక్టులు తీసుకుని పనిచేసిపెట్టే చిన్నా చితకా IT సంస్థలు చాలా వరకు మూతపడ్డాయి, అద్దెలు చెల్లించి,ఉద్యోగులకి జీతాలు ఇవ్వాల్సిరావడం ఒక కారణం అయితే లాక్ డౌన్ తరువాత ఒక వేళ సబ్ కాంట్రాక్టులు రాకపోతే ఖాళీగా నెట్టుకొచ్చిన సమయానికి అయిన ఖర్చులతో పాటు కాంట్రాక్టులు లేక మరో సారి ఖర్చులు భరించాల్సి వస్తుంది అనే భయంతో తమ కార్యకలాపాలకి స్వస్తి పలికాయి. ప్రధాన IT సంస్థలు రిజర్వ్ బెంచ్ ఉద్యోగులని కావాల్సిన దానికంటే ఎక్కువగా రిక్రూట్ చేసుకోవడానికి కారణం ఇదే !
షేర్ మార్కెట్ లో తమ విలువని కాపాడుకోవాలి అంటే ఇన్వెస్టర్ ల విశ్వాసాన్ని చూరగొనాల్సి ఉంటుంది ఏ సంస్థకి అయినా! ప్రస్తుతం టేక్ సంస్థలు వీలు ఉన్నంతవరకు తమ ఉద్యోగులని తగ్గించుకొని తద్వారా ఖర్చులు తగ్గించుకొని తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ లాభాలు పొందాలనే ఆశయంతో ఉద్యోగులని తీసేస్తున్నాయి.
జీతాలు తగ్గించి ఉన్నవాళ్ళని అలానే ఉంచేయవచ్చు కదా ?
ఉద్యోగులని అలానే ఉంచేసి జీతాలు తగ్గించి పనిచేయమని కొరడంలో ప్రస్తుతం అర్ధం లేని ఆలోచన. ప్రధాన టెక్ కంపనీలు AI మరియు 3D టెక్నాలజీ మీద ఎక్కువ పెట్టుబడులు పెట్టి తక్కువ ఉద్యోగులతో పని చేయించుకొని ఇన్వెస్టర్స్ కి లాభాలు పంచాలని చూస్తున్నాయి కాబట్టి అవసరం లేని వాళ్ళని రిజర్వ్ బెంచ్ లో ఉంచి తక్కువ జీతాలు ఇవ్వడం వృధా అని భావిస్తున్నాయి. AI మరియు 3d లమీద పనిచేయాలి అంటే నిధుల అవసరం చాలా ఉంటుంది. ఆ నిధుల కోసం అప్పులు చేస్తే ఇన్వెస్టర్స్ కి అనుమానం వస్తుంది సదరు సంస్థ పనితీరు మీద అందుకే బయట అప్పుల కోసం వెళ్ళకుండా ఉద్యోగులని తీసివేసి తద్వారా మిగిలే నిధులని కొత్త టెక్నాలజీ మీద పెట్టుబడులుగా పెడుతున్నాయి.

ఇది కేవలం అపోహ మాత్రమే ! కొద్ది శాతం మాత్రమే ఆటోమేషన్ వలన ఉద్యోగాలు పోతాయి. ఉదాహరణకి ఆటోమేషన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్[Robotic Process Automation – RPA] క్లుప్తంగా RPA అని పిలుస్తారు. RPA ని ప్రధానంగా ఉద్యోగులు పదే పదే అదే పనిని రోజంతా[24X 7] చేయడాన్ని మనుషులకి బదులు సాఫ్ట్వేర్ చేస్తుంది. ఒక RPA 10 మంది ఉద్యోగుల పనిని తానే స్వతంత్రంగా చేస్తుంది.
Robotic process automation (RPA) is a software technology that makes it easy to build, deploy, and manage software robots that emulate humans actions interacting with digital systems and software.
అయితే RPA ని ప్రతిచోటా అమలు చేయలేరు. కాబట్టి RPA పని కొద్ది చోట్ల మాత్రమే ఉంటుంది.
1. TCS, Wipro, Infosys, Tech Mahindra, HCL, and CTS లు RPA ని అమలు చేస్తున్నాయి కానీ కొద్ది శాతం మాత్రమే. ఇప్పుడు ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళలో అధిక శాతం తక్కువ నైపుణ్యం ఉన్నవాళ్లే ! రొటీన్ వర్క్ కానీ పెద్ద మొత్తంలో [High Volume ]24 గంటలు చేసేపనిని RPA ని అమలుచేసి నైపుణ్యం లేని వాళ్ళని తొలగిస్తున్నాయి.
2. మరో ముఖ్యమయిన కారణం ఏమిటంటే ఇప్పటివరకు ఆఫ్ షోర్ తో వివిధ దేశాలలో పనిచేయించుకుంటున్న టెక్ కంపనీలు వాటి స్థానంలో RPA లని ఇంప్లిమెంట్ చేస్తూ దాదాపుగా 70% పనిని తమ తమ దేశాలకి తరలించుకొని పోతున్నాయి.
3. జో బిడెన్ టెక్ కంపనీల కి స్వేచ్చని ఇచ్చాడు. అమెరికాలోని ఏ టెక్ కంపనీ అయినా సరే తమకి లాభాలు రావట్లేదని లే ఆఫ్ ప్రకటించవచ్చు. ఎలాంటి లేబర్ యాక్ట్ ని ప్రయోగించే వీలులేకుండా చేశాడు బిడెన్ ! ఆఫ్కోర్స్ కాంట్రాక్ట్ లో ఏముందో దాని ప్రకారం ఉద్యోగిని ఫైర్ చేసేముందు మూడు లేదా ఆరునెలల జీతాన్ని ఇవ్వాల్సిన నిబంధన ఉంటే దానిని అమలు చేయాలి ! ఈ విషయంలో ఎలాంటి వెసులుబాటు లేదు అమెరికన్ టెక్ కంపనీలకి !
4. ప్రస్తుతం లే ఆఫ్ లు ప్రకటిస్తున్న టెక్ కంపనీలలో సీనియర్ లేవల్ స్టాఫ్ కి ఏదో ఒకచోట ఉద్యోగం దొరికే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి వచ్చే సమస్య ఏమీ ఉండబోదు.
5. ఎటొచ్చీ ఫ్రెషర్స్, మరియు మిడ్ లెవల్ ప్రొఫెషనల్స్ కి మాత్రం కష్ట కాలమే ఇప్పుడు.
గ్లోబల్ రీ సెషన్ ?
ఇది కూడా ఒక కారణం. అమెరికా,బ్రిటన్,చైనా లాంటి దేశాలలో వడ్డీ రేట్లని పెంచాయి అక్కడి సెంట్రల్ బాంకులు. దీనివల్ల పట్టుబడులు IT సెక్టార్ నుండి అటు వైపు వెళ్ళడం కూడా ఒక కారణం. అలా అని మొత్తం నిధులు అటు వైపు మళ్లిపోయాయని కాదు కానీ చాలా దేశాలలో IT పరిశ్రమ కోసంఅని కొన్ని లేబర్ చట్టాలని సవరించారు వాళ్ళకి అనుకూలంగా ! గ్లోబల్ రీ సెషన్ ఒక సాకు మాత్రమే. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులు ఏవీ రావట్లేదు అంటూ ఉద్యోగులని తీసేస్తున్నాయి చాలా టెక్ కంపనీలు.
మెటా [ఫేస్బుక్ & ఇంస్టాగ్రామ్,వాట్స్అప్ ] 10 వేల మంది ఉద్యోగులని తీసివేస్తున్నట్లు ప్రకటించింది. అమెజాన్ 11 వేల మందిని తీసేస్తున్నట్లు ప్రకటించింది. ఇక ట్విట్టర్ అయితే అది పూర్తిగా యాజమాన్యం మారినందువల్ల ఉద్యోగులని తీసివేస్తున్నది అది వేరే కారణం.
ఇన్ఫోసిస్,tcs,మెటా,అమెజాన్,ట్విట్టర్ లాంటి దిగ్గజ కంపనీలు ఇప్పటికీ లాభాల విషయంలో ఒక స్థాయికి వచ్చేశాయి కాకపోతే పెరిగితే కొద్దిగా,అలాగే తగ్గితే కొద్దిగా ఉంటుంది లాభాల విషయంలో కాబట్టి ముందు ముందు రిజర్వ్ బెంచ్ ఉద్యోగులతో పని ఉండదు అందుకే తీసేస్తున్నాయి.
అదనంగా రిక్రూట్ చేసుకొని వేచి చూసే పద్ధతిలో ఉన్న ఈ టెక్ కంపనీలు తీసేస్తున్నది ఇంజినీరింగ్ లో డిగ్రీ ఉన్నవాళ్ళనే ! అలాగే ఈ కంపనీలు బాచిలర్ డిగ్రీ చదివి ఉద్యోగంలో చేరిన వాళ్ళ పట్ల ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు ఎందుకంటే ఏదో ఒక బాచిలర్ డిగ్రీ తో చేరిన వాళ్ళు మాటి మాటికి కంపనీలు మారరు ఇంజినీరింగ్ చేసిన వాళ్ళతో పోలిస్తే. పైగా చాలా తక్కువ వేతనం తో పనిచేస్తారు. సంవత్సరానికి వెయ్యి రూపాయలు జీతం పెంచినా సంతోషిస్తారు. ప్రస్తుతం చాలా వరకు టెక్ కంపనీలు డిగ్రీ చదివిన వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి.
లక్షల్లో ఉద్యోగాలు కోల్పోతున్నారు అంటూ సోషల్ మీడియాలో ఎవరన్నా దుష్ప్రచారం మొదలు పెట్టకముందే వాస్తవాలు ఏమిటో అందరికీ తెలియాలని ఈ పోస్ట్ ఉద్దేశ్యం ! – పార్ధసారధి పోట్లూరి