అమెరికా అంతర్జాతీయ బాస్కెట్బాల్ క్రీడాకారుడు డ్వైట్ డేవిడ్ హోవార్డ్ శాంతిని, ప్రశాంతతను వెతుక్కుంటూ కాశీ చేరుకున్నాడు. కాశీలో జీవనాధారమైన గంగానది ఒడ్డున ప్రపంచమంతా శాంతి, ప్రశాంతత నెలకొనాలని ప్రార్థించాడు. గంగానది ఒడ్డున ఉన్న బాబా విశ్వనాథుని కాశీని మోక్ష నగరం అని ఎందుకు పిలుస్తారో.. ఇక్కడ ఎందుకు దహనసంస్కారాలు చేస్తారో.. బుద్ధుడు తన మొదటి ఉపన్యాసం కాశీలోని సారనాథ్లో ఎందుకు చేశాడో మొదలగు వివరాలు తెలుసుకున్నానన తెలిపాడు.
కాశీని సందర్శించిన తరువాత, అతను ఇక్కడి జీవన తత్వానికి, ఆధ్యాత్మికతకు పొంగిపోయాననీ అన్నాడు.
డ్వైట్ హోవార్డ్ దశాశ్వమేధ్ ఘాట్ వద్ద పడవలో నుంచి గంగా ఆరతి చూసిన తర్వాత త్రిపుండ్(విభూతి)ని నుదుటిపై పెట్టుకున్నాడు. తర్వాత అతను గంగానదిలో విహరించాడు. స్థానిక దుకాణాల్లో బనారసీ చీరలు, కుర్తా-పైజామాలు కొనుక్కున్నాడు.
ఉత్తరప్రదేశ్లోని పర్యాటక శాఖ.. ఆయన కాశీకి రావడం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేసింది. ప్రపంచ ప్రఖ్యాత బాస్కెట్బాల్ క్రీడాకారుడు, NBA ఛాంపియన్ డ్వైట్ డేవిడ్ హోవార్డ్ వారణాసిని సందర్శించినట్లు ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ ట్వీట్ చేసింది. అతను గంగా హారతిని ఆస్వాదించాడు, ఆధ్యాత్మికత, సంస్కృతికి సంబంధించిన ఈ పురాతన నగరానికి తన ప్రయాణంలో తన అనుభవాలను పంచుకున్నాడు.
తన అనుభవాలను హోవార్డ్ పంచుకుంటూ, ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ప్రశాంతత లభించింది. ఈ ఆధ్యాత్మిక పర్యటన నాలో పునరుజ్జీవింప జేసింది. ఈ పవిత్ర నగర నూతన సంస్కరణలకు గానూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు. వారణాసి అనేక మంది లెజెండ్స్ కి ప్రేరణను ఇచ్చింది. ఇంకా ఏంతో మందిని ప్రేరేపింపజేయాలని నేను ఆశిస్తున్నా” అని సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు.