అంతర్జాతీయ విమాన సర్వీసులు మళ్లీ మొదలయ్యాయి. నేటినుంచి విమాన సర్వీసులు పూర్తిస్థాయిలో తిరగుతున్నాయి. కోవిడ్ కారణంగా మార్చి 23 2020నుంచి అంతర్జాతీయ విమానసర్వీసులు రద్దుచేశారు. 37 దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం కుదుర్చుకుని ఆ ఏడాది జూలై నెల నుంచి సర్వీసులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో అంతర్జాతీయ సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు ఈ నెల మొదట్లో కేంద్ర ప్రభుత్వం అనుమతిలిచ్చింది. ఈ మేరకు గతంలో వైరస్ కారణంగా విధించిన ఆంక్షల్ని సడలిస్తూ మార్గదర్శకాలిచ్చారు. పీపీఈ కిట్లు ధరించాల్సిన అవసరం లేదు కానీ, మాస్కులు ధరించడం, చేతుల్ని శానిటైజ్ చేసుకోవడం తప్పనిసరి నిబంధనలుగా పేర్కొంది. శ్వాసకోశ సమస్యలు ఉన్నవాళ్లు మాత్రం పీపీఈ కిట్లను ముందుజాగ్రత్తగా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.