భారత దేశచరిత్ర చెప్పే పెద్ద గుణపాఠం అంతర్గత ద్రోహులే ఈ దేశానికీ అసలైన శత్రువులు.ఆ వారసత్వం అంభి నుండి కొనసాగుతూనేవుంది ఈ దేశం ఎప్పుడైనా ఒడి పోయింది అంటే అంతర్గత ద్రోహులే అసలు కారణం, శతాబ్దాల చరిత్ర చెప్పే సత్యమిది, ఇది ముస్లిం ఆక్రమణ కావచ్చు , పశ్చిమ దేశాల ఆక్రమణ కావచ్చు చరిత్ర నిండా అదే మనకు కనబడుతుంది. ఈ చారిత్రిక గుణపాఠం గమనినచటమే ఈ దేశం ఎదుర్కొంటున్న అసలైన సవాలు .
ఈ సవాలు గుర్తించాలంటే ఇంకా కొన్ని విషయాలు మనకు అర్ధం కావాలి అవి
1) మనలను మనం ప్రశ్నర్ధకం చేసుకోవటం,అందు లో ప్రపంచం లో మనలను మించినవారు ఎవరు లేరు అనిచెప్పటం లో ఎటువంటి అతిశయోక్తి లేదు, అదే మనకు అసలైన సమస్య
2) అట్లాగే తమతప్పులు బయటకు రాకుండా ఎదుటి వాళ్ళలో తప్పులు వెతకటమే తమ బలం గా ఎడారి మతాల వాళ్ళ నీతి,దీనిలో వాళ్ళను మించినవాళ్లు ప్రపంచం లో ఎవరు లేరు, దీనిని హిందూసమాజం అర్ధం చేసుకోలేకపోవడం అసలుసమస్య
3) గోబెల్ ప్రచారం అని వింటూవుంటాం, దాని అర్ధం ఒక అబద్ధాన్ని పదే పదే మాట్లాడుతూ అదే సత్యమని నమ్మించే ప్రయత్నం. ఆ గోబెల్ ను మించిన వాళ్ళుమన వామపక్ష సిద్ధాంత వాదులు వీళ్ళను చూసి గోబెల్ కూడా సిగ్గు తో తలవంచుకోవాలి అంతటి ఘనులు వాళ్ళు, వాళ్ళ దుష్ప్రచారాలు మనం సరిగా అర్ధం చేసుకోలేకపోవడం
4),సత్యాసత్య వివేకకం కోల్పోయి అన్ని మతాలు సమానమని భజనలు చేసేవాళ్ళు మనవాళ్లే ఇంకొకప్రక్క, ఇటువంటి వాళ్లందురు కలసి దేశం లో గందరగోళం సృష్టించటం సాగిపోతూఉన్నది ,దీనినుండి బయటపడి సత్యాసత్యా వివేకాన్ని జాగృతం చేయటమే ఇప్పటి తక్షణ అవసరం.
చరిత్రను విస్మరించటమే ప్రశార్థకం చేసుకోవటమా ?
ప్రాచీన కాలం నుండి ఈ దేశం భరతఖండము , భరతవర్షము అనే పేర్లతోనే ప్రసిద్ధికెక్కింది. ఆధునిక చరిత్ర అని పిలిచే ఆంగ్లేయుల ఆక్రమణ లోవాళ్ళ అవసరార్ధం ఈ దేశాన్ని ఇండియా అనే పేరుతో పిలవడం మొదలుపెట్టారు. వలసపాలనలో ఇండియా పేరు విశ్వవ్యాపితమైంది. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత కూడా ఇండియా నామస్మరణే కొనసాగుతున్నది.దానిని ఈ దేశం పేరుగా స్థిరపరచాలనే పెద్దకుట్ర రాజ్యాంగ రచన సమయంలో జరిగింది దేశంలో చాలామంది వ్యతిరేకించారు దానికరణంగా రాజ్యాగంలో INDIA THAT IS BHARAT గా వ్రాసారు. దేశీయంగా మాత్రం ఈ దేశాన్ని భారత్, భారత్ మాత గానే పిలుస్తున్నారు. .ఇండియా ఆధునికతకు సంకేతమని భారత్ ప్రాచీన యశస్సుకు గుర్తుగా అని కొందరు భ్రమిస్తూఉంటారు.ప్రాచీన కాలం నుంచి మధ్యయుగాంతం వరకూ ఆర్థిక రంగంలో భారత్ ఒక సూపర్ పవర్గా కొనసాగింది. ఒకటో శతాబ్దం నుంచి 17వ శతాబ్ది వరకు ప్రపంచ దేశాల జీడీపీ లెక్కల్లో ఎక్కువ భాగం భారత్ అగ్రభాగాన కొనసాగిందని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి. బ్రిటిష్ వలస పాలన ఆ ప్రాధాన్యాన్ని పీల్చి పిప్పిచేసి మన మయూర సింహాసనం, కోహినూర్ వజ్రాలతో పాటు ఆర్థిక సూపర్ పవర్ టైటిల్ను కూడా కొల్లగొట్టింది స్వాతంత్రం వచ్చే నాటికీ దేశం ఆర్ధికంగా బలహీనమైంది.మరోప్రక్క ఇండియా అనే మాట వలసపాలన అవశేషంగా ఇప్పటికీ కొనసాగుతున్నది. గడిచిన కొద్ది సంవత్సరాలనుండి కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదం వినబడుతున్నది అది కేవలం ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించడమే కాదు. ఆ పార్టీ చుట్టూ అల్లుకున్న సాంస్కృతిక బానిసత్వం నుండి బయటపడి దేశం లో స్వాభిమానం నిర్మాణం చేయటం, అట్లాగే ఈ దేశం లోని సామాన్యుల నుండి అసామాన్యుల వరకు అందరిని పరిపాలనలో భాగస్వామ్యం చేయటం. దానితో దేశం లోని అన్ని సామజిక వర్గాలు పరిపాలనలో భాగస్వాములవుతారు దానితో భారత్ ప్రజాస్వామ్య వ్యవస్థ శక్తివంతమౌతుంది. భారతదేశంలో జాతీయ భావం పటిష్టం కావటానికి అనేక అవరోధాలు దానిలో భాష ఒకటి, మహాభారత కాలం లోనే భారత్ లో అనేక భాషలు ఉన్నాయి, ఆ భాషల అను సంధాన భాషగా సంస్కృతం ఉండేది. భాషలమధ్య సంఘర్షణ ఎప్పుడు లేదు. కానీ పార్లమెంటరీ ప్రజాస్వామ్య పాలన లో అధికారంకోసం అన్నిరకాల సంఘర్షణలకు తెరలేచింది ,దానిలో భాష ఒకటి ,ఒకప్పుడు సంస్కృతం దేశానికీ అనుసంధాన భాషగా ఉండేది కాలక్రమంలో అది ప్రాధాన్యతను కోల్పోతూ వచ్చింది దానితో స్వతంత్రం వచ్చిన తరువాత హిందీ ని అనుసంధాన భాషగా చేయాలనీ ప్రయత్నం చేస్తే దానిని కొందరు వ్యతిరేకించారు అంతేకాదు ఒక క్రొత్త వాదనను తెరపైకితెచ్చారు హిందీ యేతర దేశీ భాషలు మాట్లాడేవారి సంఖ్య ఈ దేశ జనాభాలో సగానికంటే ఎక్కువ. మైనారిటీ మతావలంబులు ఇరవై శాతానికంటే ఎక్కువే ఉన్నారు.ఆ భాషలను చిన్నచూపు చూడటమంటే దాని లక్ష్యం హిందూ, హిందీ, హిందూత్వం అని మాట్లాడటం దాని లక్ష్యం ఈ దేశాన్ని హిందూరాష్ట్రంగా నిర్మాణం చేయటం అని ప్రచారం చేస్తున్నారు దానితో వాళ్ళు చెప్పదలచుకున్నది భారత్ హిందుత్వం ఒకటి కాదు హిందుత్వం మతతత్వం.మనం హిందువులుగా పిలుచుకునే దళితులు, గిరిజనులు, దిగువశ్రేణి వాళ్ళ సంస్కృతి కూడా భిన్నమైనది.అనే వాదన పైకి తెచ్చి హిందూ హిందీ హిందుత్వం హిందూరాష్ట్రము అంటే భారత జాతీయకు వ్యతిరేకం అని మాట్లాడుతున్నారు. ఇదే మనలను మనం ప్రశ్నర్ధకం చేసుకోవటం, భారతదేశంలోని లిపి ఉన్న భాషలన్నిటిని రాజ్యాగం జాతీయ భాషలుగా ప్రకటించింది అయినా ఈ వాదన ఎందుకు ఎవరికోసం ? ఇది అంతా ఇస్లాం కారణం గ మాట్లాడుతున్నారు, భారత్ లేక హిందూ పదాలు ఉన్నపుడు ప్రపంచం లో ఇస్లాం ఉన్నదా ? లేదు అయినా ఎందుకు ఇస్లాం కు వ్యతిరేకంగా హిందుత్వం ను చూపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఇండియా భారత్ సమాన అర్ధం అని చెబుతూ హిందుఅనే దానిని విమర్శిస్తున్నారు దానికి అసలు కారణము ఇస్లాం , ఆంగ్లేయులు తమ అవసరం కోసం చరిత్ర వక్రీకరించి హిందూ ముస్లిం క్రైస్తవం అని మాట్లాడు తూ హిందూ అనేది కూడా ఒకమతం అని ప్రచారం మొదలు పెట్టారు దానినే స్వాతంత్రం వచ్చిన దగ్గరనుండి మనమూ మాట్లాడుతూ చరిత్రను విస్మరిస్తూ మన అస్తిత్వాన్ని మనమే ప్రశ్నర్ధకం చేసుకొన్నాము, చేసుకొంటున్నాము , అసలు భారత్ హిందూ సమాన అర్ధాలు కలిగిన పదాలు, అది విస్మరిస్తున్నాము దానితో ప్రస్తుత కాలం లో దేశంలో తలెత్తుతున్న సమస్యలన్నీ ఇస్లాం చుట్టూ నే తిరుగుతున్నాయి. హిందుత్వ శక్తులు వాళ్ళను అణచివేస్తున్నారు అని ప్రచారం చేస్తున్నారు. వాస్తవం దానికి వ్యతిరేకంగా ఉన్నది ఈ దేశం లోనే కాదు ఈ రోజూ ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం అక్రమణే అసలు సమస్య.
పరమత సహనం ఎడారి మతాల వాళ్ళకు ఎవరు నేర్పాలి ?
ఈ సృష్టిలోని వైవిద్యం లో ఏకత్వం ఉన్నది, అట్లాగే భారత్ లో కూడావైవిద్యం ఉన్నది ఈ దేశాన్ని సంస్కృతీ, ధర్మమూ వేల సంవత్సరాలుగా కలిపిఉంచుతున్నది. భారత దేశంలో అనేక మతాలు సంప్రదాయాలు అనేక భాషలు ఉన్న సమస్యలు రాలేదు, కానీ వందల సంవత్సరాలుగా ఎడారి మతాల వాళ్ళు మేము ప్రత్యేకం మా మతం ప్రత్యేకం అని మాట్లాడుతూ ఇతర మతాలను అంగీకరించకపోయినా కనీసం గౌరవించటం చేయక పోగా మతం మార్పిడులు దాడులతో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ అలజడి సృష్టిస్తున్నారు ఈ దేశంలోని సెక్యూలర్ మేధావులు ఉదారవాద మేధావులు వామపక్షాలవాళ్ళు ముస్లింలకు రక్షణకవచం గా ఉంటూ హిందువులపై హిందుత్వ శక్తులపై దాడులు ఆరోపణలు చేస్తుంటారు. భారత సమగ్రత కు భిన్నంగా ఉన్న జమ్మూకశ్మీర్ స్వయంప్రతిపత్తి, ప్రత్యేక అస్తిత్వం తొలగించి దేశ సమగ్రత సరిహద్దుల రక్షణకు ప్రయత్నించడాన్ని ప్రశ్నిస్తున్నారు, అట్లాగే భారత దేశం నుండి విడిపోయిన భూభాగాలలో ఉన్న ముస్లియేతరులు నిరంతరం దాడులకు గురిఅవుతువుంటే వారి రక్షణకు పౌరసత్వ సవరణ చట్టం,చేస్తే దానిని వ్యతిరేకిస్తున్నారు సుప్రీం కోర్ట్ ఉమ్మడి పౌరస్మృతిచట్టం చేయాలనీ చెబితే అది మాకు వ్యతిరేకం అని ముస్లింలు అంటే దానిని సమర్ధించేవాళ్ళు వున్నారు ఎందుకు అంటే ఇస్లాం కారణం, భారతదేశం లోని ఏకత్వానికి ఎవరు వ్యతిరేకం అంటే ముస్లిముల కంటే ఎక్కువగా ఈ దేశంలోని సెక్యూలర్ మేధావులు ఉదారవాద మేధావులు వామపక్షాలవాళ్ళు. వాళ్ళ తాజా ఆందోళన
” హిందుత్వ శక్తులు ఈ దేశం లోని అల్పసంఖ్యాక వర్గాల వేషభాషలు, వ్యక్తిగత విశ్వాసాలు, ఆహార అలవాట్లను ఈసడిస్తూ వెళ్ళగక్కుతున్న విద్వేష భావనలు- సామరస్యపూర్వక సాంఘిక జీవనాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయిఅంటారు” . తాజాగా మహ్మద్ ప్రవక్త, ఇస్లామ్ పై బీజేపీ నేతలు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన వ్యాఖ్యలు మాత్రమే పత్రికలలో పతాక శీర్షికలుగా ప్రచారం చేసి భారత దేశానికీ అంతర్జాతీయంగా తలవంపులు తెచ్చిపెట్టారు.నూపుర్ శర్మ టైమ్స్ నౌ ఛానల్ చర్చాకార్యక్రమంలో చర్చలో పాల్గొన్న ముస్లిం మతస్తుడుశివలింగం పై చేసిన అభ్యన్తరకరమైన వ్యాఖ్యలకు ప్రతిగా చేసిన వ్యాఖ్యలను మాత్రమే మాట్లాడుతూ దేశానికీ తలవంపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి వాళ్లు దేశ సమగ్రత సమైక్యతకు ఎప్పుడు సవాళ్లు విసురుతూనే ఉంటారు కానీ నిందించేది హిందువులనే ఇటువంటి చర్యలు ముస్లిమ్స్ కు బలం చేకూరుస్తూ దేశం లో ఆందోళన కు కారణ మౌతున్నాయి ఈ విషయం లో వాళ్లకు ఎవరు చెప్పాలి?. కళ్ళముందు కనబడుతున్న వివక్షపూరితమైన వ్యవహారాలు హిందువులలో ఆగ్రహం కలిగిస్తున్నది, ఈ మధ్య ఈనాడు పత్రికలో వచ్చిన ఒక వ్యాసంలో ”ఇతరుల మతాలను, ప్రవక్తలను అవమానపరచడం ద్వారా మన ఔన్నత్యం ఏ మాత్రమూ పెరిగే అవకాశం లేదు” అని హిందువులగురించి వ్రాసారు. అంటే ముస్లింలు తిడితే తిట్టించుకోవాలి కొడితే కొట్టించుకోవాలి కానీ వారిని ప్రశ్నించకూడదు అని వారి భావన ,అసలు ఎడారి మతాలు ఎప్పుడైన ఇతర మతాలను దూషించకుండ తమ మతం గొప్పతనం చెప్పుకున్న సందర్భాలు ఉంటే ఈనాడు వ్యాసం లో చెప్పవలసినది కానీ చెప్పలేదు అవకాశం దొరికితే ముస్లింలు దేవాలయాలను కూలగొట్టకుండా ఉన్న సందర్భాలు ఎక్కడన్నా ఉంటే చెప్పలేదు ఈ మధ్య ఢిల్లీ తదితర ప్రదేశాలలో శ్రీరామనవమి యాత్రలపై దాడులు చేయటం ఈనాడు పత్రికలో కూడావార్త వ్రాసారు కానీ ఎందుకు ఖండించ లేదు సత్యాసత్యాలు వాళ్లకు తెలియకుండా ఉండదు తెలిసి వ్రాస్తున్నారు అంటే అయితే ముస్లిమ్స్ అంటే భయం ఉండాలి లేదా ఏవో సిద్ధాంతాలను తలకు ఎక్కించుకొని హిందుత్వాన్ని విమర్శించటమే లక్ష్యమై ఉండాలి. ఈ విధంగా ఒక ప్రక్క ముస్లింలను రెచ్చగొడుతూ హిందువులపై వివక్షతచూపుతూ ఇస్లాం దాడులు మతమార్పిడులు ఆక్రమణలు సమర్ధిస్తూ మాట్లాడుతూ ఉంటె ఇటువంటి పోకడలు ఎటు దారితీస్తాయి దానిపరిణామాలు ఎట్లావుంటాయి దానికి ఎవరు బాధ్యత వహించాలి ? మత సహనం హిందువుల రక్తం లో ఉన్నది కాబట్టే సర్వపంథ సమభావన ఉంటుంది, ఎడారి మతాలవారు ఇతరమతాలను గౌరవించటం నేర్పకపోగా రెచ్చగొట్టటం ఎట్లా అర్ధం చేసుకోవాలి? అందుకే హిందూ సమాజంలోనే ఉన్న ఇటువంటి జాతి ద్రోహుల విషయం లో అప్రమత్తంగా ఉండవలసిన అవసర గతం కంటే ఇప్పుడు ఎక్కువగా ఉన్నది.