తనపట్ల అసభ్యపదజాలం వాడుతూ, ఇష్టారీతిన దూషిస్తున్న బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మహిళా కమిషన్ కు వైఎస్సార్టీపీ నేత షర్మిల ఫిర్యాదు చేశారు. తనను అసభ్యకరంగా దూషించిన వీడియోలను కమిషన్ కు అందచేశారు. మహిళ అనే గౌరవం లేకుండా అడుగడుగునా తనను అవమానపరుస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్న తనపై దాడులకు దిగుతున్నారని… ఎలా తిరుగుతావోనని హెచ్చరిస్తున్నారనీ ఆమె కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో మహిళలకు ఏమాత్రం గౌరవం లేదని రక్షణ అసలే లేదని ఆమె వాపోయారు.
ఆడవాళ్లు వ్రతాలు చేసుకోవాలని సాక్షాత్తూ మంత్రి కేటీఆర్ అంటారని…ఓ మంత్రేమో ఆడవాళ్లను మరదళ్లుగా సంబోధిస్తారని… మరో ఎమ్మెల్యే తనను కొజ్జా అని అంటున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. పరిశీలించిన తగిన చర్యలు తీసుకుంటామని మహిళాకమిషన్ చైర్ పర్సన్ రేఖాశర్మ తెలిపారు.
అడుగడుగునా అవమానిస్తున్నారు, తెలంగాణలో మహిళలకు గౌరవం, రక్షణ లేవు – జాతీయమహిళా కమిషన్ కు షర్మిల ఫిర్యాదు
ఆడవాళ్లు వ్రతాలు చేసుకోవాలని సాక్షాత్తూ మంత్రి కేటీఆర్ అంటారని…ఓ మంత్రేమో ఆడవాళ్లను మరదళ్లుగా సంబోధిస్తారని… మరో ఎమ్మెల్యే తనను కొజ్జా అని అంటున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. పరిశీలించిన తగిన చర్యలు తీసుకుంటామని మహిళాకమిషన్ చైర్ పర్సన్ రేఖాశర్మ తెలిపారు.
Share: