భారత రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తూ… నావికా దళ శక్తిసామర్థ్యాలను మరింత పెంచుతూ… దేశీయంగా తయారైన స్టెల్త్ గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక ‘ఐఎన్ఎస్ మోర్ముగావ్’ నౌకాదళంలోకి చేరింది. ‘విశాఖపట్నం’ క్లాస్ డిస్ట్రాయర్లలో రెండోదైన ఈ భారీ నౌకను ముంబైలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నౌకాదళంలో ప్రవేశపెట్టారు. దేశీయంగా నిర్మించిన అత్యంత శక్తిమంతమైన యుద్ధనౌకల్లో ఇదొకటి. నాలుగు శక్తిమంతమైన గ్యాస్ టర్బైన్లతో నడిచే మోర్మగావ్ గంటకు 30 నాట్లకు అంటే…గంటకు 55 కి.మీ పైగా వేగాన్ని అందుకోగలదు.నేవీకి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో దీన్ని డిజైన్ చేయగా.. మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా చేపట్టిన ఈ నౌక నిర్మాణంలో 75 దేశీయ ఉత్పత్తులనే వాడారు.