GRSE భారత నౌకాదళం కోసం ‘INS నిర్దేశక్’ని ప్రారంభించింది. భారత నౌకాదళం కోసం L&T షిప్బిల్డింగ్తో కలిసి GRSE నిర్మిస్తున్న నాలుగు సర్వే వెస్సెల్స్(SVL) ప్రాజెక్ట్లలో రెండవది ‘నిర్దేశక్’. నిన్న చెన్నైలోని కట్టుపల్లిలో ప్రారంభించారు. క్రూయిజ్ స్పీడ్ 14 నాట్స్ నుంచి గరిష్టంగా 18 నాట్ల వేగంతో పనిచేసేలా రూపొందించబడిన SVL షిప్లు ప్రస్తుతం ఉన్న ‘సంధాయక్ క్లాస్’ సర్వే షిప్లను భర్తీ చేస్తాయి. ఓసియనోగ్రఫిక్ డేటాను సేకరించేందుకు SVL నౌకలకు కొత్త తరం హైడ్రోగ్రాఫిక్ పరికరాలను అమర్చారు. ఈ షిప్ నాలుగు సర్వే మోటర్బోట్లను, ఒక హెలికాప్టర్ను తీసుకువెళ్లగలదు.
మొత్తం నాలుగు SVL షిప్ల నిర్మాణానికి సంబంధించిన ఒప్పందం MoD, గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ & ఇంజనీర్స్ (GRSE) లకు మధ్య 2018 అక్టోబర్ 30న కుదిరింది. మొదటి క్లాస్ షిప్ ‘సంధాయక్’ను గతేడాది డిసెంబర్లో ప్రారంభించారు. ఆవిష్కరణ వేడుకకు ఈస్ట్ నౌకాదళ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్, కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్గుప్తా హాజరయ్యారు.