నూతన సంవత్సరాది వేడుకల సందర్భంగా రాజస్థాన్ లోని కరౌలీలో జరిగిన మత ఘర్షణకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. కరౌలి జిల్లాలో బైక్ ర్యాలీ సందర్భంగా హింస చెలరేగే ప్రమాదం ఉందని… పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పీఎఫ్ఐ …రాజస్థాన్ సర్కారును ముందే హెచ్చరించింది. ఊరేగింపు ముస్లిం ప్రభావిత ప్రాంతాలనుంచి వెళ్తే మాత్రం హింస తప్పదని పలువురు అంచనా వేశారని చెబుతున్నారు.ఆ రోజు జరిగిన ఘర్షణలో 35 మంది గాయపడిన సంగతి తెలిసిందే.బైక్ ర్యాలీ ముందుకు సాగుతుండగా… స్థానిక ముస్లింలు యువకుల ర్యాలీపైకి రాళ్లు విసిరారు. ఉద్రిక్త పరిస్థితుల్లో జిల్లాలో కర్ఫ్యూ విధించిన పోలీసులు…ఇంటర్నెట్ సేవల్ని నిలిపేశారు.
ఘర్షణలపై దర్యాప్తు చేయడానికి ఇప్పటికే సిట్ ఏర్పాటు చేశారు. హింసకు సంబంధించిన వీడియోలను పరిశీలించి… 46మంది నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో 13 మంది విధ్వంసానికి పాల్పడ్డారని.. మరో 33 మందిని కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో విచారణ నిమిత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 21 వాహనాలను కూడా సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
అయితే అంతకుముందే రాసిన లేఖలో .. ర్యాలీ సమయంలో ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని PFI పేర్కొంది. ఊరేగింపుకు రెండు రోజుల ముందు గెహ్లాట్ ప్రభుత్వానికి రాసిన లేఖలో ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతంలో హిందూ నూతన సంవత్సర ఊరేగింపును నిర్వహించడం పట్ల PFI స్థానిక పోలీసులను సైతం అప్రమత్తం చేసింది. ఇక హింస జరుగుతుందని ముందే ఊహించిన PFI కి ఈ ఘర్షణలతో ఏదన్నా సంబంధం ఉందా అనే ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయి. ఆ సంస్థ లేఖరాసినా సరే..ప్రభుత్వం ఆరోజు ఎందుకు అదనపు బలగాల్ని పెట్టలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. చుట్టుపక్కల ఇళ్ల టెర్రస్పై నుంచి ర్యాలీపై రాళ్లు విసరడంతో ఈ ఘటనను ఇంటెలిజెన్స్ వైఫల్యంగా కూడా పేర్కొంటున్నారు.
ఘర్షణ తరువాత ఉద్రిక్తం నేపథ్యంలో శాంతిభద్రతలను అదుపులో ఉంచేందుకు కరౌలిలో 1,200 మంది పోలీసుల్ని మోహరించామని జిల్లా కలెక్టర్ రాజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)