వినూత్న నిరసన.. విన్నర్కు పెట్రోల్ డబ్బ గిఫ్ట్..!
దేశ వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. ఎన్నడూ లేని విధంగా లీటర్ పెట్రోల్ ధర రూ.100/- మార్క్ను దాటేసింది. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా నిత్యవసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి. దీంతో సామాన్య ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతోంది. ప్రతిపక్షాలు కూడా పెట్రోల్ ధరలు తగ్గించాలంటూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వ తీరులో ఎలాంటి మార్పులు ఉండటం లేదు. త్వరలో తగ్గుతాయంటూ ఊరటనిచ్చే ప్రకటనలు చేస్తున్నారే తప్ప.. ఆచరణలో మాత్రం లేదు. అయితే పెరిగిన ధరలపై మధ్యప్రదేశ్లో వెరైటీగా నిరసన తెలిపారు. భోపాల్లో నిర్వహించిన ఓ క్రికెట్ టోర్నమెంట్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విన్నర్కి 5లీటర్ల పెట్రోల్ను ఫ్రైజ్గా ఇచ్చారు. దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది.