కేరళలో కాలేజీ విద్యార్థులు వినూత్న నిరసన తెలిపారు. కేరళలోని త్రివేండ్రంలోని ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలోని బస్ స్టాప్ చాలామందికి ఇష్టమైన స్పాట్. కాలేజీ అయిపోగానే విద్యార్థినీ విద్యార్థులు అక్కడకు చేరుతారు. అయితే కొందరు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ తమకు ఇబ్బంది అవుతోందంటూ స్థానికులు ఫిర్యాదు చేశారు పలుమార్లు. యువకులపైనా స్థానిక కొందరు అమ్మాయిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడ మోరల్ పోలీసింగ్ లో భాగంగా ముగ్గురు కూర్చునే ఓ బెంచిని మూడుగా చేశారు. అంటే ముగ్గురు వేర్వేరుగా కూర్చునేవిధంగా చేశారు. అయితే పోలీసుల ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు కాలేజీ విద్యార్థినీ విద్యార్థులు. ప్రతి చర్యగా తిరువనంతపురంలోని ఓ కాలేజీ విద్యార్థులు అబ్బాయిల ఒడిలో అమ్మాయిలు కూర్చొని ఫొటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాలేజీ సమీపంలోని ఓ బస్ స్టాప్ లో ముగ్గురు కూర్చోగలిగే ఓ బెంచీని మూడు వేర్వేరు కుర్చీలుగా మార్చడం పట్ల తమ నిరసనను ‘సిట్ ఆన్ లాప్” ప్రొటెస్ట్ ద్వారా వ్యక్తం చేశారు.
“అబ్బాయిలు పక్కపక్కనే కూర్చోకూడదన్న ఉద్దేశంతోనే కొందరు ఇలా చేశారని తెలుస్తోంది. ఈ చర్యతో మేం షాక్ అయ్యాం. ఈ కాలంలో ఇలాంటి వైఖరి సరికాదు’ అని కాలేజీ యూనియన్ చైర్పర్సన్ అజ్మల్ లాబేబ్ అన్నాడు.
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు అధికారుల దృష్టికి వెళ్లాయి. తిరువనంతపురం మేయర్ ఆర్య రాజేంద్రన్ నిన్న సంఘటన స్థలాన్ని సందర్శించారు. వైఫై సౌకర్యంతో కూడిన కొత్త ‘జెండర్ న్యూట్రల్’ బస్ స్టాప్ను ఏర్పాటు చేయనున్నట్లు రాజేంద్రన్ ప్రకటించారు.