దత్తత ప్రక్రియను సరళతరం చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీం కోర్టు. ప్రస్తుతం అమల్లో ఉన్న సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ ప్రక్రియ సరిగా లేదని ధర్మాసనం అభిప్రాయ పడింది. దత్తత ప్రక్రియను సులభతరం చేయాలంటూ ‘ది టెంపుల్ ఆఫ్ హీలింగ్” సంస్థ వేసిన పిటిషన్ ను స్వీకరించిన సుప్రీం విచారణ జరిపింది.
దంపతులు ఎవరన్నా ఓ అనాథను దత్తత తీసుకోవాలనుంకుంటే…కనీసం మూడునాలుగేళ్లు పడుతోందని…ఈ ఆలస్యం వల్ల దేశంలోని లక్షలాదిమంది అనాథలు అన్యాయమైపోతున్నారంది. ఈ ప్రక్రియను సరళతరం చేస్తూ సరికొత్త నిబంధనలు రూపొందించాలని సూచించింది.న్యాయమూర్తులు. జస్టిస్ చంద్రచూడ్,జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ జేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసనం ఇంకా పలు సూచనలు చేసింది. కేంద్రం తరపున అదనపు సొలిసిటల్ జనరల్ ఎంకె నటరాజన్ విచారణకు హాజరయ్యారు. కేంద్రం దృష్టికి ఈ విషయం తీసుకెళ్తానని.. ఆరువారాల్లోగా సమాధానం సమర్పిస్తానని నటరాజన్ ధర్మాసనానికి విన్నవించారు.