జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)పలుచోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించింది. మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, కర్నాటక, బిహార్, మధ్యప్రదేశ్ లో సోదాలు సాగాయి. ఐసిస్ ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలున్నట్టు సమాచారం ఉండడంతో ఏకకాలంలో ఈ దాడులకు దిగింది ఎన్ఐఏ. గుజరాత్ లోని బరుచ్, సూరత్, నవ్ సారీ, భోపాల్లో, యూపీలోని దియోబంద్ జిల్లాలో జరిగిన సోదాల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది దర్యాప్తుసంస్థ. ఇక ఉగ్రవాదసంస్థలతో సబంధం ఉన్న ఓ వ్యక్తినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతను భత్కల్ సన్నిహితుడని చెబుతున్నారు. మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు గుజరాత్ యాంటీ టెర్రరిజం స్వ్కాడ్ తెలిపింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో సంబంధం ఉన్న ఆరోపణలతో బిహార్లోని నలంద జిల్లాలో సోదాలు నిర్వహించారు. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అటు కేరళలోనూ దాడులు నిర్వహించింది ఎన్ఐఏ.తిరువనంతపురంలో జరిగిన సోదాల్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఐసిస్ ఉగ్రవాద కేసులకు సంబంధించి సుమోటాగా స్వీకరించిన ఎన్ఐఏ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది.