ఆంధ్రప్రదేశ్ నుంచి పరిశ్రమలన్నీ ఒక్కొక్కటిగా తరలిపోతుండడంపై ప్రతిపక్ష టీడీపీ ఆందోళన వ్యక్తం చేసింది. వైసీపీ నేతల వేధింపులే అందుకు కారణమని మండిపడుతున్నారు ఆ పార్టీ నేతలు. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం జగన్ ఫొటోకు దండేసి దండం పెడుతోందని పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు.ఏపీలో వ్యాపారం చేయాలన్నా, ఏదన్నా పరిశ్రమ పెట్టాలన్ని జగన్ బినామీ అయినా అయి ఉండాలి లేదా.. ఆయన వర్గానికి వాటాలన్నా ఇవ్వాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఏపీ ఎంపీ గల్లా జయదేవ్ కు చెందిన అమర్ రాజా సంస్థ ఏంఓయూ తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకున్న సంగతి తెలిసిందే.