షీనా బోరా హత్య నిందితుడు శ్యాంవర్ రాయ్కి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇంద్రాణి ముఖర్జీ, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా సహా ఇతర నిందితులందరికీ బెయిల్ మంజూరైనందున సమానత్వం ప్రాతిపదికన బెయిల్ మంజూరు చేసింది. ఇంద్రాణి డ్రైవర్గా రాయ్ హత్యకు పాల్పడ్డాడు. 2015లో మరో కేసులో అరెస్టయ్యాడు, ఆ తర్వాత ఇంద్రాణి ముఖర్జీ కుమార్తె షీనా బోరా హత్యకేసులో బుక్కయ్యాడు. జూన్లో ఈ కేసులో ఇంద్రాణి ముఖర్జీ మాజీ భర్త సంజీవ్ ఖన్నాకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఇంద్రాణి ముఖర్జీకు మే నెలలో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
పీటర్ ముఖర్జీ సహా ఈ కేసులో మిగిలిన నిందితులందరూ ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నారు.