పదేళ్లనాడు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనాబోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆమె తల్లి ఇంద్రాణీ ముఖర్జీకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇంద్రాణీ ఆరున్నరేళ్లుగా కస్టడీలో ఉంది. అయితే పీటర్ ముఖర్జీపై విధించిన షరతులే ఇంద్రాణీకి వర్తిస్తాయని స్పష్టం చేసింది. తన కుమార్తె షీనా బతికే ఉందంటూ ఇంద్రాణి… గత నెలలో సీబీఐకి లేఖ రాసింది. తాను ప్రస్తుతం కశ్మీర్ల ఉందని అందులో పేర్కొంది. 2012 ఏప్రిల్లో 24 ఏళ్ల షీనా బోరాను భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామవర్ రాయ్ తో కలిసి ఇద్రాణీ హత్య చేశారు. ఆ తరువాత రాయగఢ్ జిల్లాలోని అడవిలో ఆమె మృతదేహాన్ని దహనం చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్నేళ్లుగా ఎప్పటికప్పుడు రకరకాల సాక్ష్యాధారాలతో కేసు నడుస్తూనే ఉంది. తాజాగా ఇంద్రాణీకి బెయిల్ మంజూరైంది.