ఇండోనేషియా వ్యవస్థాపక అధ్యక్షుడు సుకర్నోకుమార్తె సుక్మావతీ సుకర్నోపుత్రి హిందూమతాన్ని స్వీకరించారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఈనెల 26న సంప్రదాయబద్దంగా ఆమె ఇస్లాం నుంచి హిందువుగా మారారు. బాలీ ద్వీపంతో హైందవ సంప్రదాయం ప్రకారం వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆమె హైందవం స్వీకరించారు. ముస్లిం మెజారిటీ దేశం అయిన ఇండోనేషియాలో ఆ దేశ తొలి అధ్యక్షుడి కుమార్తె మతం మారడం ఆసక్తికరంగా మారింది.