భారత్ గౌరవ్ పథకం కింద భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైలు సర్వీస్ కోయంబత్తూర్ నుంచి షిర్డీకి ప్రారంభమైంది. “రైల్వే శాఖ ఈ రైలును సర్వీస్ ప్రొవైడర్కు రెండేళ్ల కాలానికి లీజుకు తీసుకుంది. ఇందులో మొదటి, రెండవ, మూడవ తరగతి AC కోచ్లు సహా స్లీపర్ కోచ్లు కలిపి మొత్తం 20 కోచ్లు ఉన్నాయి” అని దక్షిణ రైల్వే CPRO బి.గుగణేశన్ తెలిపారు.
Promoting India's rich cultural heritage!
Southern Railway becomes the first zone to get its first Registered service provider under the ‘Bharat Gaurav’ Scheme & commence operations of the maiden service from Coimbatore North to Sainagar Shirdi, today. pic.twitter.com/7cPSj9iP8i
— Ministry of Railways (@RailMinIndia) June 14, 2022
ఈ సర్వీస్ ను భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రచారంగా రైల్వే మంత్రిత్వ శాఖ అభివర్ణించింది.
“దక్షిణ రైల్వే ‘భారత్ గౌరవ్’ పథకం కింద తన మొదటి రిజిస్టర్డ్ సర్వీస్ ప్రొవైడర్ను పొందిన మొదటి జోన్గా అవతరించింది. కోయంబత్తూర్ నార్త్ నుంచి సాయినగర్ షిర్డీకి తొలి సర్వీసు కార్యకలాపాలు ఈరోజు ప్రారంభమయ్యాయి” అని రైల్వే శాఖ ట్వీట్ చేసింది.