‘స్వదేశీ’ హైపర్లూప్ సిస్టమ్ అభివృద్ధి కోసం IIT మద్రాస్తో చేతులు కలిపింది ఇండియన్ రైల్వె. 8.34 కోట్ల అంచనా వ్యయంతో ఇన్స్టిట్యూట్లో హైపర్లూప్ టెక్నాలజీల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయడంలో కూడా సాయం చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనల్లో హైపర్లూప్ ప్రాజెక్ట్ కూడా ఒకటి.
ప్రతిపాదిత హైపర్లూప్ వ్యవస్థ విమానాలు, రైల్వేల కంటే వేగంగా ఉండే ఐదవ రవాణా వ్యవస్థ.
హైపర్లూప్ అనేది విమానం వంటి వేగంతో ప్రజలను, వస్తువులను రవాణా చేయడానికి లో ప్రెషర్ ట్యూబ్లలో మాగ్నెటిక్ లెవిటేషన్ను ఉపయోగించే సాంకేతికతపై పనిచేస్తుంది.
ఈ హైపర్లూప్ సాంకేతికత ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది, ప్రపంచవ్యాప్తంగా అనేక విభిన్న కంపెనీలు ఈ ఆలోచనను వాణిజ్య వ్యవస్థగా మార్చడానికి పని చేస్తున్నాయి. భారత రైల్వే ‘మేక్ ఇన్ ఇండియా’ విధానంలో ప్రముఖ విద్యాసంస్థల సహాయంతో హైపర్లూప్ టెక్నాలజీపై దేశీయంగా ఒక ప్రాజెక్ట్ను అభివృద్ధి చేయాలని భావిస్తోంది.
అవిష్కార్ హైపర్లూప్ అనే విద్యార్థి బృందాన్ని IIT మద్రాస్ ఏర్పాటు చేసింది. మొదటి హైపర్లూప్ సిస్టమ్ను రూపొందించడానికి గ్లోబల్ రేస్లో ముందుగా నిలిచింది. జూలై 2021లో జరిగిన యూరోపియన్ హైపర్లూప్ వీక్లో “మోస్ట్ స్కేలబుల్ పాడ్” అవార్డును కూడా గెలుచుకుంది.
తక్కువ శక్తి అవసరంతో భారతదేశాన్ని కార్బన్ న్యూట్రల్ గా మార్చడంలో ఈ సాంకేతికత.. హైపర్లూప్ రవాణా విధానాన్ని భారతీయ రైల్వేలకు ఆకర్షణీయమైన ప్రతిపాదనగా మార్చింది.