తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న సెమీ హై స్పీడ్ రైలు వందే భారత్… 2023 ఫిబ్రవరి లోగా ఇక్కడకు రానుంది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మధ్య వందే భారత్ ట్రైన్ను నడపాలన్న ప్రతిపాదనకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. ఆ మేరకు సన్నాహాలు మొదలయ్యాయి కూడా. అయితే విజయవాడ వరకే కాక.. విశాఖపట్నం వరకు పొడిగించే ప్రతిపాదనపై చర్చ నడుస్తోంది., సాధ్యాసాధ్యాలు అధ్యయనం చేస్తున్నారు రైల్వే నిపుణులు. ప్రస్తుతం న్యూ ఢిల్లీ-వారణాసి, న్యూ ఢిల్లీ-శ్రీ మాతా వైష్ణో దేవి కాట్రా, న్యూ ఢిల్లీ-అంబ్ అందౌరా, ముంబై సెంట్రల్-గాంధీ నగర్, మైసూర్-చెన్నై రూట్లలో వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. భారతప్రధాని నరేంద్రమోదీ వాటిని ప్రారంభించారు. సికింద్రాబాద్- విజయవాడ రైలునూ ప్రధానే ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు.