రామాయణ యాత్రను ప్రారంభిస్తోంది ఇండియన్ రైల్వే. సౌత్ ఇండియాలో ఈ స్పెషల్ టూర్ సాగుతోంది.
ఈ టూర్లో భాగంగా ప్రయాణికులు.. దక్షిణ భారత దేశంలో రామాయణం, శ్రీరాముడికి సంబంధం ఉన్న ప్రదేశాలను దర్శిస్తారు. అంటే.. త్రయంబకేశ్వర్ ఆలయం, పంచవటి, సీతా గుహ, కలరామ్ ఆలయం, హంపీలో.. అంజనాద్రి పర్వతం, విరూపాక్ష ఆలయం, విట్టల ఆలయాన్ని దర్శించుకుంటారు. ఇంకా ప్రయాణికులు.. రామేశ్వరంలో… రామానాథస్వామి ఆలయం, ధనిష్కోటిని దర్శిస్తారు. అలాగే విష్ణుకంచి ఆలయం, శివకంచి, కాంచీపురంలో కామాక్షి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుంటారు.
టూరిజం ట్రైన్ స్కీమ్లో భాగంగా సాగే యాత్ర వచ్చేఏడాది జనవర్ 25 నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్యాకేజీలో 10 రాత్రులు, 10 పగళ్లు ఉంటాయి. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ తోపాటూ.. మథుర, ఆగ్రా, గ్వాలియర్, విరంగన లక్ష్మీభాయ్ ఝాన్సీ, లలిత్పూర్, బినా, భోపాల్లో కూడా ప్రయాణికులు రైలు ఎక్కవచ్చు.యాత్రికులు ఇంకా.. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం, అంజనీ స్వామి ఆలయాన్ని దర్శిస్తారు. రామ్టెక్ కోట, నాగపూర్లోని స్థానిక ఆలయానికి వెళ్తారు.ఈ జర్నీ మూడు కేటగిరీలుగా ఉంది. కంఫర్ట్ కేటగిరీలో ఒకరికి టికెట్ ధర రూ.42,155గా ఉంది. అదే ఇద్దరు లేదా ముగ్గురు షేరింగ్ అయితే.. రూ.36,655 చొప్పున వసూలు చేస్తోంది.ఇక సుపీరియర్ కేటగిరీలో ఒక్కరికి టికెట్ ధర రూ.34,150 ఉండగా.. ఇద్దరు లేదా ముగ్గురికి రూ.29,695 రూపాయలుగా ఉంది. ఇక స్టాండర్డ్ కేటగిరీలో ఒక్కరికి టికెట్ ధర రూ.28,550 ఉండగా.. ఇద్దరు లేదా ముగ్గురికి రూ.24,825 చొప్పున ధరలున్నాయి.