ఆస్ట్రేలియన్ సామాజిక శాస్త్రవేత్త డాక్టర్ సాల్వటోర్ బాబోన్స్ మంగళవారం భారతదేశంలోని ‘మేధావి’ వర్గాన్ని గట్టిగా విమర్శించారు. వారు బహుశా సమాజంలో తమ స్థానాన్ని కోల్పోతున్నారని అయన అన్నారు. ఆయన భారత ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసిస్తూ “మోదీ వ్యక్తిత్వం భారతదేశ మేధావి వర్గానికి అవమానకరంగా అనిపిస్తూ అసహనానికి గురి చేస్తోంది.” సమాజంలో తమ స్థానాన్ని కోల్పోయారనే కోపంతో ఈ మేధావి వర్గానికి అసహనం ఎక్కువ అవుతోంది.” అని బా అన్నారు.
ఇండియా టుడే కాన్క్లేవ్లో భారతదేశ వామపక్ష-ఉదారవాద ముఠాను విమర్శించడంతో పాటు ఆ మేధో వర్గాన్ని భారత వ్యతిరేకులు అన్న బాబోన్స్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ‘జర్నలిస్ట్’ మాధవన్ నారాయణన్ ట్విట్టర్లో వ్యాఖ్యానిస్తూ “ఆయనెవరు భారత ప్రజాస్వామ్యం మీద అభిప్రాయం వెలిబుచ్చడానికి “అని అన్నాడు.
అంతే కాక ” సాల్వటోర్ బాబోన్స్ ఎవరు? అతని గొప్పతనం ఏంటి? నా లేదా మీ అభిప్రాయం కంటే అతని అభిప్రాయం ఎందుకు గొప్పది?”
అని కూడా నారాయణ్ మాధవ్ వ్యాఖ్యానించాడు.
https://twitter.com/sardesairajdeep/status/1589454851012202501?s=20&t=w1-H0–OtHOwZSLk-ptTcw
ఉదార లెఫ్ట్ ముఠాను బాబొన్స్ విమర్శించడం సహించలేక ప్రభుత్వాన్ని ప్రశ్నించడం దేశభక్తి క్రిందకు వస్తుంది, ప్రభుత్వాన్ని విమర్శించడం అంటే దేశాన్ని విమర్శించడం కాదు అంటూ ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయి కూడా లెఫ్ట్ ముఠాను వెనకేసుకు వచ్చాడు. ఇప్పుడే కాదు, మేధావులు యుపిఏ ప్రభుత్వాన్ని కూడా విమర్శించారు, అందువల్ల బాబాన్స్ విమర్శలు అర్ధరహితమైన అని సర్దేసాయ్ అన్నాడు.
అయితే, బాబోన్స్ మాత్రం తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను భారతదేశంలోని మేధావి వర్గం వారి హృదయాలలో, వారు చాలా గర్వించదగిన దేశభక్తులని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను, కానీ బయట వారు చేసే వ్యాఖ్యలు భారతదేశానికి వ్యతిరేకమైనవి. అంటే వారు భారతదేశం గురించి మాట్లాడటానికి బహిరంగ వేదికపైకి వెళ్ళినప్పుడు, వారు ఖచ్చితంగా భారతదేశం సాధించిన విజయాలను హైలైట్ చేయరు, ”అని బాబోన్స్ అన్నారు.
మరీ ముఖ్యంగా, వారు భారతదేశాన్ని విమర్శించాలి, కానీ అలా విమర్శించినప్పుడు, వారు న్యాయంగా మరియు నిష్పాక్షికంగా చేయరు. దాని బదులుగా, ఈ మేధావులు తమ అంతర్జాతీయ వ్యాఖ్యానాలలో భారతదేశం అత్యంత చెత్తగా వుంది అని ప్రదర్శించడానికి ప్రయత్నించినట్లు నేను టన్నుల కొద్దీ సాక్ష్యాలను చూస్తున్నాను. ఇది భారతీయులందరికే కాదు, భారతదేశంలోని మేధావులకు కూడా సమస్య ” అని అన్నారాయన.
భారతదేశ రాజకీయాలను దగ్గర నుండి చూడని పాశ్చాత్య ప్రపంచాన్ని భారతదేశ ఈ ‘మేధావులు’ భారతదేశం ఫాసిస్ట్ దేశమని నమ్మేలా చేస్తున్నారని ఆయన అన్నారు. “ భారతదేశం ఫాసిస్ట్ దేశం కాదు, కానీ భారతీయ మేధావులు ప్రపంచాన్ని నమ్మేలా చేస్తున్నారు. భారత రాజకీయాలను పాశ్చాత్య ప్రపంచం దగ్గరగా అనుసరించడం లేదు కాబట్టి ప్రపంచం ఈ.ప్రచారాన్ని ఎందుకు నమ్మదు,? ”అని ఆయన అన్నారు. పశ్చిమ దేశాల భాష మాట్లాడే ఈ భారతీయ మేధావులు నిజాయితీగా ఉండాలి. అది వారి పాత్ర అని ఆయన అన్నారు.
అతను ప్రధాని నరేంద్ర మోడీని కూడా కొనియాడుతూ,సమాజంలో తమ స్థానాన్ని కోల్పోయినట్లు చేసి వామపక్ష ఉదారవాదులను కోపంతో ఊగిపోయే టట్లు చేసిన మోడీ చాలా గొప్పవాడని అన్నారు. ప్రపంచంలోని అత్యంత అసాధారణమైన విజయవంతమైన ప్రజాస్వామ్య దేశం భారతదేశంతో తాను అనుసంధానించబడినందుకు సంతోషంగా ఉన్నానని కూడా ఆయన అన్నారు. ఈ ప్రజాస్వామ్యానికి నేను భక్తుడిగా చాలా సంతోషంగా ఉన్నాను” అని బాబోన్స్ ట్వీట్ చేశారు.
భారతదేశంలో సమస్యలున్నాయి. ఉద్యమకారులకు, జర్నలిస్టులకు మరియు మేధావులకు ఖచ్చితంగా సమస్యలను బయటకు తెలియజేయడంలో పాత్ర ఉంది. కానీ సమస్య ఏమిటంటే, ఈ పాత్ర పోషిస్తున్నప్పుడు వారికి నచ్చిన విధంగా అంతర్జాతీయంగా ప్రదర్శిస్తున్నారు ”అని అతను చెప్పాడు. భారతదేశం ఫాసిస్ట్ దేశం కాదని, ప్రపంచ మీడియా దీన్ని ఫాసిస్ట్ రాజ్యంగా తప్పుగా చిత్రీకరిస్తోందని పునరుద్ఘాటించారు.
https://twitter.com/sbabones/status/1589709044310495232?s=20&t=0zXrODCLRgZl2vMoj9dUMA