భారతసైన్యం అమ్ములపొదిలోకి సరికొత్త డ్రోన్లు చేరాయి. సరిహద్దుల్లో తరచూ కయ్యానికి కాలుదువ్వుతున్న చైనాపై నిఘా కోసం ఇజ్రాయెల్ నుంచి ఈ డ్రోన్లు తెప్పించారు. హెరాన్ మానవ రహిత డ్రోన్లు అత్యాధునిక సాంకేతికతతో సరిహద్దుల్లో నిఘాపెట్టనున్నాయి. ఇప్పటికే ఆర్మీకి డ్రోన్లు ఉన్నప్పటికీ తాజాగా తెప్పించిన డ్రోన్ల అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైనవి. యాంటీ-జామింగ్ వంటి పలు అధునాతన సదుపాయాలున్నాయి. సుదీర్ఘ సరిహద్దు భద్రతకు మరిన్ని చిన్న/మధ్య తరహా నిఘా డ్రోన్లను దేశీయ సంస్థల నుంచి కొనుగోలు చేయడానికి రక్షణశాఖ సన్నద్ధమవుతోంది.

File Photo